నారా లోకేష్ పాదయాత్రలో నందమూరి తారకరత్న గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. గత 15 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు తాజా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. గతంలో కంటే తారకరత్న ఆరోగ్యం ఇంకాస్త మెగురు పడిందనీ.. గుండె పని తీరులో ఇంకాస్త పురోగతి కనిపించిందనీ వైద్యులు చెప్తున్నారు. దేశ విదేశాల్లోని హార్ట్ నిపుణుల బృందం తారకరత్నకు అత్యుత్తమ ట్రీట్మెంట్ అందిస్తున్నారని నారాయణ హృదయాలయ పేర్కొంది. మెదడు పని తీరు కూడా కాస్త మెరుగైందని చెప్తున్నారు. అయితే.. ప్రమాదం నుంచి బయటపడినట్టే అని మాత్రం చెప్పటం లేదు. ఇప్పటికీ ఆయన ఆరోగ్యం క్రిటికల్ కండిషన్లోనే ఉంది.
15 రోజులుగా తారకరత్న ఆరోగ్య పరిస్థితిని, వైద్యాన్ని బాలకృష్ణ పర్యవేక్షిస్తున్నారు. తారకరత్న కుటుంబం నారాయణ హృదయాలయలోనే ఆయన వెంటే ఉంది. వైద్యానికి తారకరత్న స్పందిస్తున్నారనీ.. ఆయన క్షేమంగా మళ్ళీ ఇంటికి చేరుకుంటారనీ కుటుంబ సభ్యులు చెప్తున్నారు.