ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా సంక్రాంతి కానుకగా ప్రేక్షకులను అలరించిన బాలయ్య బాబు వీరసింహారెడ్డి ఓటీటీలోకి రానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వీరసింహారెడ్డి ఫిబ్రవరి 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో వచ్చిన వీర సింహారెడ్డి సంక్రాంతికి ఫుల్ జోష్ నింపింది. అదిరిపోయే బాక్సాఫీస్ కలెక్షన్లతో నిర్మాతను, బయ్యర్లనూ అందరినీ లాభాలతో ముంచెత్తింది. వీరసింహారెడ్డి రిలీజైన రెండు రోజుల తర్వాత వచ్చిన చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా.. బాలయ్య సినిమాను ఓవర్ టేక్ చేసేసింది. వీరసింహారెడ్డి కంటే మంచి రేటింగ్ సంపాదించిన వాల్తేరు వీరయ్య సినిమా వచ్చిన తర్వాత.. వీరసింహారెడ్డి కలెక్షన్లు కాస్త డల్ అయ్యాయి. కానీ రెండు సినిమాలూ పోటాపోటీగా కలెక్షన్లు సాధించాయి.
టాలీవుడ్ కు పరిచయమైన హనీ రోజ్ కు వీరసింహారెడ్డితో తెలుగులో కోట్లాది మంది ఫ్యాన్స్ వచ్చారని చెప్పాలి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన హనీ రోజ్ ఫోటోలూ, వీడియోలే దర్శనమిచ్చాయి. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సక్సెస్ తో శృతి హాసన్ డబుల్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.