సంచలనం సృష్టించిన ఢిల్లీ అంజలి కేసులో పోలీసులు మరిన్ని షాకింగ్ నిజాలను బయటపెట్టారు. అంజలి అనే అమ్మాయి ఎవరో తెలియదని మొదట బుకాయించిన నిందితులు ఇప్పుడిప్పుడే అసలు నిజాలు ఒప్పుకుంటున్నారు. ఆ రోజు తాము అంజలిని కారుతో ఢీకొట్టిన విషయమే తమకు తెలియని చెప్పిన నిందితులు ఇప్పుడు పోలీసుల విచారణలో నిజం చెప్పారు. అంజలి కారు కింద ఇరుక్కుపోయిన విషయం తమకు తెలుసనీ.. కానీ యాక్సిడెంట్ జరిగిన విషయాన్ని ఎవరూ గమనించవద్దనే భయంతోనే కారును ఆపకుండా ముందుకు తీసుకెళ్ళామనీ నిందుతులు చెప్పారట. మద్యం సేవించి ఉన్న తమను ఎవరైనా గమనిస్తే చిక్కుల్లో పడతామనే భయంతోనే కారును ముందుకు తీసుకెళ్ళామనీ.. కానీ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కారును 12 కిలోమీటర్ల వరకూ ఆపే సాహయం చేయలేదనీ నిందితులు పోలీసుల ముందు చెప్పారట. ఈ ఆరుగురు నిందితులకు కోర్టు 14 రోజుల పోలీస్ కస్టడీ విధించగా.. ప్రస్తుతం వారు పోలీసుల విచారణలో నిజాలు కక్కుతున్నారు. మున్ముందు క్రైమ్ కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.