Home INTERNATIONAL NEWS షాంఘైలో మరణ మృదంగం

షాంఘైలో మరణ మృదంగం

0
షాంఘైలో మరణ మృదంగం

కోటి 75 లక్షల మందికి వైరస్

కరోనా వైరస్ తో అల్లాడుతున్న చైనాలో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. షాంఘై సిటీలోనే ఒక కోటి 75 లక్షల మందికి వైరస్ పాజిటివ్ రిపోర్టు వచ్చినట్టు అంతర్జాతీయ మీడియా చెప్తోంది. రోగులకు సరిపడా వైద్యులు, బెడ్లూ అందుబాటులో లేక వైరస్ సోకిన వారు రోడ్లపైనా, ఫుట్ పాత్ ల పైనా పడుకుంటున్నారనీ.. కనీస వైద్యం అందక ప్రతి రోజూ వేలల్లో మరణాలు నమోదు అవుతున్నాయనీ సమాచారం. ఇక స్మషానాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒక శవాన్ని కాల్చటానికి మృతుడి కుటుంబానికి కేవలం 5 నిముషాల సమయం మాత్రమే ఇస్తున్నారట. 5 నిముషాల్లో శవాన్ని కాల్చేసి అస్తికలు తీసుకొని స్మషానం నుంచి బయటకు రావాల్సిందే. అంటే.. అక్కడ మరణాలు ఎంత స్థాయిలో సంభవిస్తున్నాయో ఊహించికోవచ్చు. చైనాలో కరోనా ఒమిక్రాన్ బీఎఫ్7 వేరియంట్ అల్లకల్లోలంపై అంతర్జాతీయ మీడియా ఎన్ని కథనాలు ప్రచురిస్తున్నా.. చివరకు ప్రపంచ ఆరోగ్య సమితి సైతం ఆందోళన వ్యక్తం చేసినా.. చైనా మాత్రం ఈ వార్తలను అంగీకరించటం లేదు.
అయితే.. చైనాలో వైరస్ విస్తృతి మొదలైన రెండు వారాల్లో భారత్ లో కూడా అల్లకల్లోలం తప్పదని వచ్చిన వార్తలకు బ్రేక్ పడింది. ఇప్పటికే చైనాలో వైరస్ ఉధృతి మొదలై నాలుగు వారాలకు పైగా సమయం గడిచినా.. భారత్ పై ఎలాంటి ప్రభావం చూపకపోవటం ఊరటనిచ్చే విషయం. భారతీయులు కూడా కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. భారతీయులు వాడిన వ్యాక్సిన్ ప్రభావాన్ని మించి కరోనా వైరస్ ప్రభావం చూపించలేదనీ.. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాత్రం ఆరోగ్య శాఖ చెప్తోంది. కానీ అప్రమత్తంగా ఉంటూ.. మాస్క్ ధరించటం శ్రేయస్కరమని చెప్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here