Home TELANGANA బీఆర్ఎస్ పై పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ పై పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

0
బీఆర్ఎస్ పై పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ పై తిరుగుబాటు మొదలుపెట్టిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రాక్షస ప్రభుత్వం నడుస్తోందనీ.. ఎమ్మెల్యేలు రాక్షసుల్లా ప్రవర్తిస్తూ దోచుకుంటున్నారనీ అన్నారు. తనకు నాలుగేళ్ళుగా పదవులు దక్కక పోవటం వల్ల ఇలా మాట్లాడటం లేదనీ.. అరాచక పాలనపై గొంతు విప్పకుండా ఉండలేక పోతున్నానని అన్నారు. బీఆర్ఎస్ నేతలను ఉద్దేశిస్తూ.. తన మాటల వల్ల వారికి ఇబ్బందులు ఎదురైతే.. మరి వాళ్ళు తనను ఎంత ఇబ్బంది పెట్టారో నాకే తెలుసు అంటూ వ్యాఖ్యానించారు. పరోక్షంగా సీఎం కేసీఆర్ పై కూడా పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రేమించటం ఆ వ్యక్తికి చేతకాదని.. గద్దల్లా తనపై యుద్ధం చేయాలని ఆయన వెంట ఉన్న వారు ఆలోచిస్తున్నారనీ అన్నారు.

శీనన్న ఒక్కడు కాదు.. శీనన్న వెంట ప్రజలున్నారు.. ఖమ్మంలో నాకు ఎవ్వరూ గాడ్ ఫాదర్ లేడు.. నా తండ్రి.. నా తాత రాజకీయాల్లో లేరు.. నాకు నేనే గాడ్ ఫాదర్.. ఖమ్మం జిల్లా ప్రజలంతా నా వాళ్ళే.. దేనికైనా నేను సిద్ధంగానే ఉన్నాను.. ఇప్పుడు మీరు రెచ్చిపోవచ్చు.. మీకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుంది.. అంటూ పరోక్షంగా కేసీఆర్ ను బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పొంగులేటి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here