తెలంగాణ చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. సోమేష్ కుమార్ ఆంధ్ర ప్రదేష్ కు వెళ్ళిపోవాలంటూ హీకోర్టు తీర్పునిచ్చింది. సీఎస్ సోమేష్ కుమార్ నియామకం అక్రమం అంటూ రేవంత్ రెడ్డి ఆరోపించిన నేపథ్యంలో ఈ తీర్పు రావటం సంచలనంగా మారింది. దీనిపై 3 వారాల సమయం కావాలన్న న్యాయవాది కోరికను కూడా కోర్టు తిరస్కరించింది. వెంటనే సోమేష్ కుమార్ తెలంగాణ సీఎంతో భేటీ అయ్యారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో వీరి భేటీకి ప్రాముఖ్యత ఏర్పడింది. కేసీఆర్ ఎలాంటి చర్య తీసుకోబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు రేవంత్ రెడ్డి ఈ విషయంపై స్పందించారు. తాను గతంలోనే సోమేష్ కుమార్ నియామకం అక్రమమంటూ చెప్పానన్నారు. ఆయన తీసుకువ్చిన ధరణి పోర్టల్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి ట్విటర్ లో పోస్టు చేశారు.