అందాల భామ కీర్తి సురేష్ డ్రెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. డైరెక్టర్ వెంకీ అట్లూరి పెళ్ళికి హీరో నితిన్ తో కలిసి హాజరైన కీర్తి సురేష్.. ఈ ఈవెంట్ కోసం వేసుకొచ్చిన కాస్ట్యూమ్ ప్రస్తుతం ట్రోల్ అవుతోంది. రంగురంగుల డ్రెస్ వేసుకొని రావటమే ఈ ట్రోల్ కు కారణం. నాలుగు షామ్యానాలు చింపేసి కలిపి కుట్టించినట్టు ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మల్టీ కలర్ డ్రెస్ ఏంటి కీర్తి అని ఆమె ఫ్యాన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. భైరవద్వీపం సినిమాలో కనిపించే జంట దయ్యాల ఫోటోను రిప్లైలో జత చేస్తున్నారు. ఈ దయ్యాలు కూడా రంగు రంగుల గుడ్డలన్నీ కలిపి కుట్టించిన బట్టల్లో కనిపిస్తాయి సినిమాలో. ఎవరికి తోచిన కామెంట్ వారు చేసేస్తున్నారు కీర్తి సురేష్ డ్రెస్ పై.
వెంకీ అట్లూరి డైరెక్షన్లో వచ్చిన రంగ్ దే సినిమాలో నితిని, కీర్తి కలిసి నటించారు. అందుకేనేమో ఇద్దరూ కలిసి వెంకీ పెళ్ళి వేడుకకు హాజరై వధూవరులను కలిసి విష్ చేశారు. అయితే నితిన్ మాత్రం మాలధారణలో ఉన్నాడు కాబట్టి కాషాయ వస్త్రాల్లోనే కీర్తితో కలిసి వచ్చాడు. ఏదైతేనేం.. పాపం కీర్తి మరోసారి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. అప్పుడప్పుడు ఫ్యాషన్ ఇలాగే డిజాస్టర్ అవుతుంది.