Home INTERNATIONAL NEWS అతీక్ ను చంపినందుకు ప్రతీకారం తప్పదు : అల్ ఖైదా వార్నింగ్

అతీక్ ను చంపినందుకు ప్రతీకారం తప్పదు : అల్ ఖైదా వార్నింగ్

0
అతీక్ ను చంపినందుకు ప్రతీకారం తప్పదు : అల్ ఖైదా వార్నింగ్

ఉత్తర్ ప్రదేశ్ మోస్ట్ డేంజరస్ రౌడీ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ ను చంపినందుకు భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ పాకిస్తాన్ కు చెందిన అల్ ఖైదా భారత్ ను హెచ్చరించింది. చనిపోయిన ఇద్దరినీ అమరవీరులుగా గుర్తిస్తున్నట్టు రంజాన్ సందేశంలో పేర్కొన్న అల్ ఖైదా.. తమ వారిని చంపినందుకు ప్రతీకార దాడులు తప్పవని తీవ్ర హెచ్చరికలు చేసింది. ఈ ఇద్దరు రౌడీ షీటర్ల హత్యను కొన్ని పార్టీలు రాజకీయం చేసి వాడుకొని ఏదో అమాయకులను ప్రభుత్వం చంపినట్టు చిత్రీకరిస్తున్నాయి. వందకు పైగా క్రిమినల్ కేసులు.. హత్య, కిడ్నాప్ వంటి అభియోగాలు వీరిపై ఉన్నాయి. పాకిస్తాన్ ఐఎస్ఐతో పాటు తీవ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్టు పోలీసుల విచారణలో తెలిసింది. అల్ ఖైదా బెదిరింపుతో ఇప్పుడు అతీక్ గ్యాంగ్ కు తీవ్రవాద సంస్థలతో సంబంధాలున్న విషయం స్పష్టమవుతోంది. ఇలాంటి వ్యక్తులను ప్రజా నాయకులుగా, అన్యాయానికి గురి కాబడిన వారిగా చిత్రీకరిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయి కొన్ని పార్టీలు.
సమాజ్ వాదీ పార్టీ తరఫునే ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నికైన అతీక్.. అదే పార్టీ కోసం ఎన్నో నేరాలు చేసినా సమాద్ వాదీ నేతలు మాత్రం అతీక్ ఓ దేశభక్తుడు, సంఘ సంస్కర్త అనే స్థాయిలో ప్రచారం చేస్తోంది. అధికార బీజేపీ తో పాటు సీఎం యోగీ అదిత్యనాథ్ ముస్లింలపై కక్షకట్టిందంటూ అబద్ధపు ప్రచారం చేస్తోంది. రాజకీయ లాభం కోసం కొంత మంది చేస్తున్న ఈ దుష్ప్రచారం నిజంగానే హిందూ, ముస్లిం వర్గాల మధ్య అగ్గి రాజేస్తే పరిస్థితి చేయిదాటిపోతుంది. ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ గ్యాంగ్ స్టర్ ను ప్రత్యర్థులు మాటు వేసి హత్య చేస్తే అది బీజేపీ కక్ష సాధింపు చర్య అనీ, ముస్లింలపై దౌర్జన్యమనీ ప్రచారం చేయటం కేవలం అఖిలేష్ యాదవ్ పార్టీకే చెల్లింది. ఇప్పుడు అల్ ఖైదా ఎంట్రీతో త్వరలో ఇది భారత్-పాకిస్తాన్ సమస్యగా చిత్రీకరించబడుతుంది. దీన్ని ఇక్కడికిక్కడే అణచి వేయకపోతే.. భారత్ లో అంతర్గత పోరుకు దారితీస్తుంది అనటంలో సందేహం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here