HomeTELANGANAత్వరలో వరంగల్ లో మోడీ పర్యటన.. టీబీజేపీకి లాభిస్తుందా !?

త్వరలో వరంగల్ లో మోడీ పర్యటన.. టీబీజేపీకి లాభిస్తుందా !?

Published on

Latest articles

“We Have to Listen to the ISI”: Pakistan Defence Minister Makes Candid Remarks

Pakistan's political system has long been the subject of debate, with critics alleging that...

Big News for IPL Fans: BCCI Reportedly Considering Major Scheduling Change

Cricket enjoys immense popularity in India, with the Indian Premier League (IPL) being one...

Social Media Speculation Over Missing Child Draws Criticism

In the race for views and subscribers, many social media users are resorting to...

ప్రధానమంత్రి మోదీ వచ్చే నెలలో తెలంగాణలో పర్యటించనున్నారు. జూలై 8న వరంగల్ లో పర్యటించి ఖాజీపేట వ్యాగన్ ఓరలింగ్ సెంటర్, మెగా టైక్స్టైల్ పార్కు కు శంకుస్థాపన చేయనున్నారని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. శంకుస్థాపన కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత హన్మకొండలోని ఆర్స్ట్ కాలేజ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. కొద్ది రోజుల క్రితం అమిత్ షా తెలంగాణలో పర్యటించాల్సి ఉండగా ఉత్తరాదిన తుఫాన్ బీభత్సం సృష్టించటంతో ఆయన పర్యటన రద్దు చేసుకున్నట్టు తెలంగాణ బీజేపీ నేతలు చెప్పారు. ఇప్పుడు ప్రధాని మోడీ వరంగల్ లో పర్యటించనున్నారు. కొద్ది రోజులుగా తెలంగాణ బీజేపీ స్తబ్దుగా మారింది. ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై తీవ్రంగా చర్చ జరగటంతో పాటు బండి సంజయ్ ను తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పిస్తారంటూ వార్తలు వినిపించాయి. కానీ అవేవీ లేవని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్పంగా చెప్పటంతో ఈ వార్తలకు అడ్డుకట్ట పడింది.

గత కొంత కాలంగా తెలంగాణ బీజేపీలో వర్గపోరు ఎక్కువైంది. ఈటెల రాజేందర్ మరియు బండి సంజయ్ మధ్య గ్యాప్ ఉన్నదనీ.. తెలంగాణ బీజేపీలో ఎన్నికల ముందు భారీ మార్పులు తప్పవనీ వినిపించింది. అంతే కాదు.. ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి వెళ్ళబోతున్నారని కూడా జోరుగా వార్తలు వినిపించాయి. చివరికి అలాంటిదేమీ లేదని వాళ్ళే క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ బీజేపీలో ఇంతటి కన్ఫ్యూజన్లు నెలకొన్న వేళ.. వాటిని ఏమాత్రం క్లియర్ చేయని జాతీయ అధిష్టానం.. మోడీ పర్యటనను షెడ్యూల్ చేయటం గమనార్హం. ముందుగా పార్టీలోని స్థానిక సమస్యలను పరిష్కరించి.. నేతల మధ్య అగాధం పూడ్చి.. ఎన్నికలకు ఓ స్పష్టమైన దిశా నిర్దేశం చేయకుండానే ఇలా ప్రధానమంత్రి పర్యటనలు చేయటం వల్ల తెలంగాణలో బీజేపీ బలపడే అవకాశాలు చాలా తక్కువ. మోడీ, అమిత్ షా, నడ్డా లాంటి వాళ్ళు వచ్చి వెళ్ళిపోతారు.. కానీ స్థానిక నేతల మధ్య ఐక్యత లేకపోతే పార్టీ పుంజుకోవటం అసాధ్యం. తెలంగాణలో కేసీఆర్ చరిష్మాను దాటి బీజేపీకి ఓట్లు పడాలంటే అన్నింటికంటే ముఖ్యంగా కావాల్సింది పార్టీలో ఐక్యత. అది లేకుండా జాతీయ నేతలు వచ్చి పోవటం వల్ల వచ్చే లాభమేమీ ఉండబోదు అనేది విశ్లేషకుల అభిప్రాయం.

FOLLOW US

More like this

“We Have to Listen to the ISI”: Pakistan Defence Minister Makes Candid Remarks

Pakistan's political system has long been the subject of debate, with critics alleging that...

Big News for IPL Fans: BCCI Reportedly Considering Major Scheduling Change

Cricket enjoys immense popularity in India, with the Indian Premier League (IPL) being one...

Social Media Speculation Over Missing Child Draws Criticism

In the race for views and subscribers, many social media users are resorting to...