Home TELANGANA కేసీఆర్ పుట్టిన రోజున కొత్త సచివాలయం ప్రారంభం

కేసీఆర్ పుట్టిన రోజున కొత్త సచివాలయం ప్రారంభం

0
కేసీఆర్ పుట్టిన రోజున కొత్త సచివాలయం ప్రారంభం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు నాడే తెలంగాణ కొత్త సచివాలయ భవనం ప్రారంభం కానుంది. వేద పండితులు నిర్ణయించిన ముహూర్తానికి కేసీఆర్ స్వయంగా ఆయన చేతులతోనే కొత్త సెక్రెటేరియట్ భవనాన్ని ప్రారంభిస్తారని మంత్రి వేముల ప్రశాంత్ తెలిపారు. ఫిబ్రవరి 17న ఉదయం 11 గంటల 30 నిముషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిముషాల మధ్య ఈ కార్యక్రమం వేద పండితులు, వాస్తు పండితుల మధ్య ఘనంగా నిర్వహించబడుతుందని చెప్పారు. ఇదే సమయంలో వాస్తు పూజ, చండీయాగం, సుదర్శన యాగం వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. నిన్ననే కొత్త సచివాలయ నిర్మాణ పనులను వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు.
ఈ కార్యక్రమానికి పలువురు జాతీయ నేతలు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్ కే స్టాలిన్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్, జేడీయూ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్, నితీష్ కుమార్ వంటి నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. సుమారు 6 వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో 7 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మిస్తున్న కొత్త సెక్రెటేరియట్ భవనం గత అక్టోబర్ లో దసరా రోజునే ప్రారంభం కావాల్సి ఉండగా.. పనులు పూర్తి కాకపోవటంతో వాయిదాపడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here