HomeNATIONAL NEWSకాంగ్రెస్ కు అసలు యుద్ధం ఇక్కడే : సచిన్ Vs గెహ్లాట్

కాంగ్రెస్ కు అసలు యుద్ధం ఇక్కడే : సచిన్ Vs గెహ్లాట్

Published on

Latest articles

New Twists Await in the OTT Version of Sing Geetham

Veteran filmmaker Singeetam Srinivasa Rao, known for creating some of the most innovative films...

Do You Want a Puppy? I’ll Send One”: Pawan Kalyan Fulfills a Young Fan’s Wish

Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan met a 17-year-old fan from Warangal who...

Good News: Oil Supply Resumes; Petrol Prices May Fall

The disruption in global oil exports caused by the Middle East conflict has finally...

కర్ణాటక ఎన్నికల యుద్ధం చివరి అంకానికి వచ్చింది. దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికలను 2024 సార్వత్రిక పోరుకు సెమీఫైనల్‌గా భావించినా.. ఇక నుంచి జరిగే ప్రతి ఎన్నికా అంతకుమించే ఉంటుంది. మరీ ముఖ్యంగా బీజేపీని ఓడించాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్‌కు 2024 సార్వత్రిక ఎన్నికల్లో చివరి ఓటు పోలయ్యే వరకూ చావో రేవో తేల్చుకునేలానే యుద్ధం చేయాల్సి ఉంటుంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పరిణామాలు సంభవించినప్పటికీ.. ఆ పార్టీకి అసలైన సవాల్ మాత్రం ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లోనే. కర్ణాటకలో ఓడినా అక్కడ అధికారంలో లేం కాబట్టే అని సరిపెట్టుకోవచ్చు. కానీ, రాజస్థాన్‌లో అధికారంలో ఉండికూడా ఓడితే దాని ప్రభావం ఖచ్చితంగా వచ్చే సార్వత్రిక ఎన్నికలపై పడుతుంది. ఇదే సమయంలో ఇప్పటికే తిరుగులేని శక్తిగా ఉన్న కమలం పార్టీ మరింత స్ట్రాంగ్‌గా మారుతుంది. ఈ విషయాలన్నీ ప్రత్యర్ధులకంటే గ్రాండ్ ఓల్డ్ పార్టీకి ఇంకాస్త ఎక్కువగానే తెలుసు. ఎందుకంటే మధ్య ప్రదేశ్, పంజాబ్‌లో తగిలిన ఎదురు దెబ్బలను మరిచిపోవటం హస్తం పార్టీకి అంత తేలిక కాదు.
ఈ ఏడాది చివరినాటికి రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగబోతోంది. దీనికోసం కమలం పార్టీ ఆల్రెడీ గ్రౌండ్‌లెవెల్‌ యాక్షన్‌లోకి కూడా దిగిపోయింది. ఇప్పటికే ప్రధాని మోడీ రాజస్థాన్‌లో అభివృద్ధి యాక్షన్‌ షురూ చేశారు. అయితే, అధికారంలో ఉన్న హస్తం పార్టీ పరిస్థితే అంతగా బాలేదు. సీనియర్, జూనియర్ పంచాయితీలో టాప్‌లో ఉండే హస్తం పార్టీని రాజస్థాన్‌లోనూ అవే సమస్యలు వెంటాడుతున్నాయి. గతంలో ఎన్నికల్లో గెలిచిన తర్వాత అశోక్ గెహ్లట్, సచిన్ పైలెట్ మధ్య సీఎం కుర్చీ వివాదం రాజుకుంది. అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం పిలిచి ఇద్దరిని కన్విన్స్ చేసి అశోక్‌గెహ్లట్‌ను సీఎంగా ప్రకటించింది. సీనియారిటీకే ప్రధాన్యత ఇచ్చింది. కానీ, సచిన్ పైలట్ కారణంగానే రాజస్థాన్‌లో హస్తం పార్టీ గెలిచిందనే వాదన ఉంది. సచిన్ పైలట్ సైతం కష్టం తనది, సీఎం కుర్చీ మాత్రం అశోక్‌దీ అన్నట్టుగా చాలా సందర్భా ల్లో వ్యతిరేకతను బయటపెడుతూనే ఉన్నారు. ఇటీవల నిరాహార దీక్షలు సైతం నిర్వహించిన సచిన్.. ఇప్పుడు జన్ సంఘర్ష్ యాత్ర అంటూ జనంలోకి వెళ్లిపోయారు. అదికూడా అధిష్టానం మాట లెక్కచేయకుండానే.
తమ గళాన్ని వినిపించడానికి, ప్రజల గొంతులను తెలుసుకోడానికీ, తాను ప్రజల గళంగా మారడానికీ ఈ యాత్ర చేపట్టినట్టు సచిన్ పైలట్ తెలిపారు. అవినీతిపై పోరాటం అగ్ని నదిని దాటడం లాంటిదని, మనం ఆ నదిని ఈదాల్సిందేనని తన మద్దతు దారులకు పిలుపునిచ్చారు. ఇదే సమయంలో వేలాది మంది మద్దతుదారులు ఈ యాత్రలో సచిన్ పైలట్‌ను అనుసరించారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్ష పేపర్ల లీకేజీ గురించి కూడా ఈ యాత్రలో పైలట్‌ ప్రస్తావించారు. రాజస్థాన్‌లో అవినీతిని అరికట్టాలని ఏడాది కాలంగా తాను సీఎంకు లేఖలు రాస్తున్నా, ఎలాంటి చర్యలు చేపట్టలేదని మరోసారి పునరుద్ఘాటించారు. సచిన్ జన్‌సంఘర్ష్‌ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో ఓ అంచనాకు వచ్చిన హస్తం పార్టీ.. పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నాలు చేసింది. తాజా యాత్ర పూర్తి‌గా సచిన్ వ్యక్తిగతమని, పార్టీతో దీనికి ఎలాంటి సంబంధం లేదని రాజస్థాన్‌ కాంగ్రెస్‌ లీడర్ గోవింద్‌ స్పష్టం చేశారు. పార్టీ గుర్తు, కాంగ్రెస్‌ అగ్రనేతల ఫొటోలతో చేపడితేనే అది కాంగ్రెస్‌ యాత్ర అవుతుందని, సచిన్ యాత్ర అలాంటిది కాదన్నారు.
ఓ వైపు సచిన్ పైలట్ తాను ఎవరినీ టార్గెట్ చేసేందుకు యాత్ర చేయడం లేదని స్పష్టంగా చెబుతుంటే.. మరోవైపు ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మాత్రం సచిన్‌ను టార్గెట్ చేస్తూ జన్ సంఘర్ష్‌ యాత్రకు లేనిపోని మైలేజ్ ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఇదే సమయంలో ప్రధాని మోడీ సైతం ఇటీవల తన రాజస్థాన్ పర్యటన లో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. రాజస్థాన్ కాంగ్రెస్‌లో ఐక్యత లేదనీ, వారిలో వారు తన్నుకోవడానికి టైం సరిపోవడం లేదనే అర్ధం వచ్చేలా సెటైర్లు వేశారు. సీఎం కుర్చీ కోసమే తప్ప ప్రజల ప్రయోజనాలు హస్తం పార్టీ నేతలకు పట్టవంటూ ఫైర్ అయ్యారు. ఫలితంగా మధ్య ప్రదేశ్, పంజాబ్‌లో జరిగినట్టే రాజస్థాన్‌లోనూ జరుగుతోందా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
గతంలో మధ్య ప్రదేశ్‌లో జరిగిందే ఇప్పుడు రాజస్థాన్‌లోనూ జరుగుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. మధ్య ప్రదేశ్‌లో కూడా జ్యోతిరాధిత్య సిందియాకు సంబంధించిన విషయంలో సీఎం పదవి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ఇవ్వలేదు. దీంతో విసిగి వేసారిపోయిన జ్యోతిరాధిత్య సింధియా బీజేపీలో చేరి కేంద్ర మంత్రి పదవి చేపట్టారు. మరో రాష్ట్రం పంజాబ్‌లోనూ ఇంచుమించు ఇలాంటి పరిస్థితులే తలెత్తాయి. అక్కడ కెప్టెన్ అమరీందర్ సింగ్, సిద్ధు మధ్య జరిగిన అంతర్గత రచ్చతోనే అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉండి కూడా దారుణంగా ఓటమి పాలయ్యారు. సింపుల్‌గా చెప్పాలి అంటే పంజాబ్, మధ్య ప్రదేశ్ లాంటి ఇంపార్టెన్స్ ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్ తనకు తానే ఓటమి కొనితెచ్చుకుంది. ఇదే సమయంలో ఆయా ప్రాంతాల్లో బీజేపీ పుంజుకుంటోంది. ఇప్పుడు రాజస్థాన్‌లోనూ అదే జరిగేలా కనిపిస్తోంది.
మరోవైపు.. రాజస్థాన్‌లో రాజకీయ పరిణామాలు కూడా చాలా వేగంగా మారిపోతున్నాయి. అసాధ్యం అనేచోట కమలం పార్టీ బూస్టింగ్ ఇచ్చే విజయం సాధించింది. స్థానిక లోకల్ బాడీ ఎన్నికల్లో 14 స్థానాల్లో బీజేపీ 8 చోట్ల విక్టరీ కొట్టింది. ఇదే సమయంలో అధికారంలో ఉన్న హస్తం పార్టీ కేవలం నాలుగు అంటే నాలుగు స్థానాలకే పరిమితమైంది. ఇప్పటివరకు జరిగిన ఉప ఎన్నికల్లో ఎక్కడా కూడా కాంగ్రెస్ ఓడి పోలేదు. కానీ, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనకబడటం ఊహించని పరిణామం. ఇలాంటి టైంలో సచిన్ పైలట్ గేర్ మార్చడం కాంగ్రెస్‌ను కష్టాల్లోకి నెట్టడం మాత్రమే కాదు. అంతకుమించిన ఫలితాలనే ఇవ్వబోతోందనే విశ్లేషణలు మొదలయ్యాయి. అదే నిజమై మధ్య ప్రదేశ్, పంజాబ్‌ను చేజార్చుకున్నట్టే రాజస్థాన్‌ను కూడా కోల్పోవాల్సి వస్తే మాత్రం 2024లో గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆశించిన ఫలితం ఎంతమాత్రం రాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సింపుల్‌గా చెప్పాలంటే సచిన్ వర్సెస్ గెహ్లాట్ ఎపిసోడ్‌కు ముగింపు ఇవ్వగలిగితేనే హస్తం పార్టీకి అవకాశాలుంటాయి. ఆ విషయంలో కాంగ్రెస్ పెద్దలు ఎంతవరకూ సక్సెస్ అవుతారో చూడాలి.

FOLLOW US

More like this

New Twists Await in the OTT Version of Sing Geetham

Veteran filmmaker Singeetam Srinivasa Rao, known for creating some of the most innovative films...

Do You Want a Puppy? I’ll Send One”: Pawan Kalyan Fulfills a Young Fan’s Wish

Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan met a 17-year-old fan from Warangal who...

Good News: Oil Supply Resumes; Petrol Prices May Fall

The disruption in global oil exports caused by the Middle East conflict has finally...