HomeFILM NEWSవిజయ్ రష్మిక విడిపోయారా.. రష్మిక ఎమోషనల్ పోస్ట్

విజయ్ రష్మిక విడిపోయారా.. రష్మిక ఎమోషనల్ పోస్ట్

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య ఏదో ఉందంటూ నిత్యం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంటుంది.. ఈ ప్రచారానికి తగ్గట్టే వీళ్ళిద్దరూ అప్పుడప్పుడూ కలిసి తిరుగుతూ కెమెరా కంట పడుతుంటారు. కలిసి హాలిడేస్ వెళ్తున్నారనీ.. కలిసే ఉంటున్నారనీ.. ఇలా రకరకాల ప్రచారం వీళ్ళద్దరి చుట్టూ జరుగుతుంటుంది. రీసెంట్ గా వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ ఇంట్లోనే భోజనం చేయటం.. అదీ ఫ్యామిలీలతో సహా కనిపించటంతో వీళ్ళిద్దరూ పెళ్ళి చేసుకుంటారని అభిమానులు ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు రష్మిక మందన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఫ్యాన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తోంది. ఫాలింగ్ అపార్ట్ అంటూ ఓ ఎమోషనల్ వీడియోను రష్మిక షేర్ చేసింది. కొంత మంది మన జీవితంలోకి వస్తూ ఉంటారు.. వెళ్తూ ఉంటారు.. అనే అర్థం వచ్చేలా రష్మిక చేసిన ఈ పోస్ట్ ను చూస్తే విజయ్ దేవరకొండకు, రష్మికకు మధ్య ఏదో తేడా జరిగినట్టుంది అనే అనుమానం ఫ్యాన్స్ లో కనిపిస్తోంది.

రష్మిక ఇలాంటి పోస్టులు ఎప్పుడూ చేయదు.. ఎప్పుడూ చిల్ అవుతూనే ఉంటే మూమెంట్స్ ను తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది. కానీ ఈ సారి రష్మిక ఇలా ఎమోషనల్ కావటం వెనుక ఏదైనా కారణం ఉందా.. లేకపోతే క్యాజువల్ గా అలా స్టోరీ షేర్ చేసిందా అని ఫ్యాన్స్ తెగ ఆలోచనలో పడిపోయారు. ఎప్పుడు ఎక్కడ విజయ్ గురించి ఎవరు ప్రశ్న వేసినా రష్మిక విజయ్ తన సొంత మనిషి అన్నట్టుగా సమాధానం ఇస్తుంది. రీసెంట్ గా ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ నా కోసం ఎప్పుడూ ఉంటాడు.. అంటూ మరోసారి ఎమోషనల్ సమాధానం చెప్పింది రష్మిక. మరి ఇప్పుడు ఇలాంటి స్టోరీ ఎందుకు షేర్ చేసిందోనని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఏకంగా డిస్కషన్లు పెట్టేస్తున్నారు.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...