HomeINTERNATIONAL NEWSమరోసారి భగ్గుమన్న ఖలిస్తాన్ వేర్పాటు వాదం : మోడీ సర్కార్ కు సవాల్

మరోసారి భగ్గుమన్న ఖలిస్తాన్ వేర్పాటు వాదం : మోడీ సర్కార్ కు సవాల్

Published on

Latest articles

Good News for Vijay: Jana Nayagan Set for Release After Censor Clearance

Tamil superstar Thalapathy Vijay's much-awaited final film, Jana Nayagan, is finally expected to hit...

E20 Petrol May Reduce Mileage, Government Clarifies the Facts

The Central Government has acknowledged that using E20 petrol (fuel blended with 20% ethanol)...

అమృత్‌పాల్ సింగ్.. వారిస్ పంజాబ్ దే చీఫ్ గా తనను తాను ప్రకటించుకొని.. పంజాబ్‌లో మత విద్వేషాలు రెచ్చగొట్టి, సామాజిక మాధ్యమాల ద్వారా యువతను బుట్టలో వేసుకుని ఖలిస్తానీవాదం నూరిపోసిన వ్యక్తి. కొంతకాలం కిందట పంజాబ్‌లో అమృత్‌‌పాల్ సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. తన మద్దతు దారుల కోసం పోలీస్ స్టేషన్ లో కత్తులు కటార్లతో వీరంగం సృష్టించడం దగ్గర నుంచి.. పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం వరకూ.. దాదాపు 35 రోజుల సుదీర్ఘ ఆపరేషన్‌ తర్వాత పోలీసులకు చిక్కడం వరకూ ఇతడి పేరు దేశంలో మార్మోగుతూనే ఉంది. చివరికి అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్ట్ చేసిన తర్వాత దేశంలో ఖలిస్తానీవాదానికి ఆల్మోస్ట్ ఎండ్‌కార్డ్ పడిపోయింది. అడపాదడపా ఖలిస్తానీ పోస్టర్లు కలకలం రేపినా, వాటికి ఎప్పటికప్పుడు కేంద్రం చెక్ పెట్టేస్తోంది. కానీ, విదేశాల్లో కూడా ఇలాంటి అమృత్‌పాల్ సింగ్ ఒకరున్నారు. భారత ఎంబసీలపై జరుగుతున్న ప్రతిదాడి వెనుక అతడి హస్తం కనిపిస్తోంది. తాజాగా అతడు ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు వార్తలొచ్చాయి. కానీ, అందులో నిజం లేదంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు.

ఆ వీడియోలో ఉన్న వ్యక్తి పేరు గురుపత్వంత్ సింగ్ పన్నూ.. సిఖ్ ఫర్ జస్టిస్ చీఫ్. విదేశాల్లో రెచ్చిపోతున్న ఖలిస్తానీ భూతాన్ని ముందుండి నడిపిస్తున్నది ఇతడే. తాజాగా ఓ రోడ్డు ప్రమాదంలో ఇతడు మరణించినట్టు వార్తలొచ్చాయి. కానీ, అనూహ్యంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ముందు నిల్చుని మాట్లాడుతున్న ఓ వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో కెనడా, అమెరికా, యూకేల్లో భారతీయ దౌత్యవేత్తలను బెదిరిస్తూ వెలిసిన పోస్టర్ల వెనక తన హస్తం ఉన్నట్లు పన్నూ స్పష్టం చేశాడు. ఇటీవల కెనడాలో చంపబడిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ తన సోదరుడని.. ఆయనతో తనకు 20 ఏళ్ల అనుబంధం ఉన్నట్లు చెప్పాడు. హర్దీప్‌సింగ్ నిజ్జర్ చనిపోవడానికి అమెరికా, కెనడాల్లోని భారతీయ దౌత్యవేత్తలే కారణం అని తాజాగా విడుదల చేసిన వీడియోలో ఆరోపించాడు. న్యూయార్క్‌లో యూఎన్ కార్యాలయం ముందు నిలబడి.. ఓదో రోజు ఖలిస్తాన్ జెండా ఇక్కడ ఎగురుతుందని అనడం వీడియోలో చూడవచ్చు. ఈ ఒక్క వీడియో చాలు ఖలిస్తానీవాదాన్ని ఎలా ముందుకు తీసుకెళుతున్నాడో చెప్పడానికి.

ఈ వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత ఎవరీ పన్నూ? అతడి గురించి భారత్ ఎందుకు ఆందోళన చెందుతోంది? అని సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. గురు పత్వంత్ సింగ్ స్వస్థలం పంజాబ్‌లోని అమృత్‌సర్‌ జిల్లా ఖాంకోట్‌ గ్రామం. తండ్రి మహేందర్‌సింగ్‌ పంజాబ్‌ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. దేశ విభజన సమయంలో వారి కుటుంబం పాకిస్తాన్‌ నుంచి ఇక్కడికి వచ్చింది. పన్నూది ధనిక కుటుంబం.. వ్యవసాయ భూములు, విద్యా సంస్థలు ఉన్నాయి. ముగ్గురు సంతానంలో ఒకరైన పన్నూ గురించి స్వగ్రామంలో ఎవరికీ పెద్దగా తెలియదు. పంజాబ్‌ విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ పూర్తిచేసి.. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాడు. ఆ దేశ పౌరసత్వం తీసుకొని అమెరికా, కెనడాల్లో న్యాయవృత్తిలో ప్రవేశించాడు. ఇంత వరకూ అంతా బాగానే ఉన్నా.. 2007లోనే అతడిలోని రెండో మనిషి బయటకొచ్చాడు.

2007లో కొందరితో కలిసి సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ అనే సంస్థను ప్రారంభించి.. మానవ హక్కుల కోసం ఏర్పాటుచేసిన సంస్థగా చెప్పుకున్నాడు గురుపత్వంత్ సింగ్ పన్నూ. పంజాబ్‌ను సిక్కుల స్వయంప్రతిపత్తి ప్రాంతంగా ఖలిస్తాన్‌ ఏర్పాటు చేయటం తమ ఉద్దేశంగా పేర్కొన్నాడు. అప్పటి నుంచి విదేశాల్లో భారత వ్యతిరేక ప్రదర్శనలు, ఆందోళనలు సభలు, సమావేశాలకు కేంద్ర బిందువుగా వ్యవహరిస్తున్నాడు. కెనడా, అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియాల్లో భారత్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. సోషల్‌ మీడియా లో రెచ్చగొట్టే పోస్టులు పెడుతూ.. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రముఖ భవనాలపై తరచూ ఖలిస్తాన్‌ జెండా ఎగరేస్తూ అందరి దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నాడు. అంతేకాదు, ఖలిస్తాన్‌ జెండా చేతపట్టే వారికి ఐ-ఫోన్లు, ఇతర ఖరీదైన బహుమతులను ఎరగా వేసి యువతను ఆకర్షిస్తుంటాడు. అంతటితో ఆగకుండా భారత నేతలను న్యాయపరంగా ఇరుకునపెట్టే ప్రయత్నాలు సైతం చేస్తూ వస్తున్నాడు.

2014లో ప్రధాని మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, సోనియాగాంధీ, సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌, పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్‌సింగ్‌లపై అమెరికా, కెనడాల్లో కేసులు కూడా వేశాడు. ఈ కేసులతోనే అమరీందర్‌ సింగ్‌ 2016లో అమెరికా పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత భారత్-చైనా గల్వాన్ ఘర్షణల్లో చైనాకు మద్దతుగా ప్రకటన చేశాడు. గల్వాన్‌లో చైనా సైనికుల పట్ల భారత సైన్యం జరిపిన క్రూరమైన దాడిని ఖండిస్తున్నట్టు జిన్‌పింగ్‌కు సంఘీభావం తెలిపాడు. ఇలాంటి ఎన్నో భారత వ్యతిరేక చర్యలకు పూనుకున్నాడు పన్నూ. ఈ క్రమంలోనే ఎస్‌ఎఫ్‌జే చర్యలు హద్దులు శ్రుతి మించడంతో 2019లో ఈ సంస్థను కేంద్రం నిషేధించి..

అనంతరం పన్నూను ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇలాంటి ఛాన్స్ కోసమే చూసే పాక్.. రెఫరెండమ్-2020పేరుతో ఖలిస్తాన్‌కు మద్దతు కూడగట్టే పన్నూ ప్రయత్నాలకు మద్దతు ఇచ్చింది. అప్పటి నుంచీ పత్వంత్ సింగ్ పన్నూ మరింత రెచ్చిపోవడం మొదలుపెట్టాడు.
ఇప్పుడు పత్వంత్‌సింగ్ పన్నూను అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. లేదంటే విదేశాల్లో ఖలిస్తానీవాదం మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదు. కానీ, అమృత్‌పాల్ సింగ్‌‌ను అరెస్ట్ చేసినంత ఈజీగా పన్నూను అడ్డుకోవడం అంత ఈజీ కాకపోవచ్చు. విదేశాల వ్యవహారం కాబట్టి ఆయా దేశాల నుంచి సహకారం ఉంటేనే అది సాధ్యమవుతుంది. కెనడా లాంటి దేశాలయితే ఇందుకు అంగీకరించే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. మరి ఈ విషయంలో మోడీ సర్కార్ ఎలా ముందుకెళుతుందో చూడాలి.

FOLLOW US

More like this

Good News for Vijay: Jana Nayagan Set for Release After Censor Clearance

Tamil superstar Thalapathy Vijay's much-awaited final film, Jana Nayagan, is finally expected to hit...

E20 Petrol May Reduce Mileage, Government Clarifies the Facts

The Central Government has acknowledged that using E20 petrol (fuel blended with 20% ethanol)...

Why PM Modi Visited Indonesia’s Prambanan Temple: A Symbol of Shared Civilizational Heritage

Prime Minister Narendra Modi's visit to the Prambanan Temple in Indonesia has drawn global...