HomeINTERNATIONAL NEWSవెయ్యి మంది ముందు పాకిస్తాన్ మంత్రి పరువు తీసిన జైశంకర్

వెయ్యి మంది ముందు పాకిస్తాన్ మంత్రి పరువు తీసిన జైశంకర్

Published on

Latest articles

“We Have to Listen to the ISI”: Pakistan Defence Minister Makes Candid Remarks

Pakistan's political system has long been the subject of debate, with critics alleging that...

Big News for IPL Fans: BCCI Reportedly Considering Major Scheduling Change

Cricket enjoys immense popularity in India, with the Indian Premier League (IPL) being one...

Social Media Speculation Over Missing Child Draws Criticism

In the race for views and subscribers, many social media users are resorting to...

భిలావల్ భుట్టో జర్దారీ.. ఈ పేరెక్కడో విన్నట్టుంది కదా.. మొన్న గోవాలో జరిగిన షాంఘై కోఆపరేట్ ఆర్గనైజేషన్ సమ్మిట్ లో భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ తో పిచ్చి తిట్లు తిన్న పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి. ఎస్ సీ ఓ సమ్మిట్ భారత్ లో జరుగుతున్నది కాబట్టి సభ్య దేశాలన్నింటినీ భారతదేశం తరఫున అధికారికంగా ఆహ్వానించటం విదేశాంగ శాఖ బాధ్యత. అందులో భాగంగానే పాకిస్తాన్ కు కూడా మన దేశం నుంచి ఆహ్వానం వెళ్ళింది “ఎస్ సీ ఓ సమ్మిట్ కు మీ ప్రతినిథులను పంపించండి” అంటూ పాకిస్తాన్ కు ఆహ్వానం పంపటంపై మీడియా జై శంకర్ ను “అసలు పాకిస్తాన్ నుంచి ఎవరైనా వచ్చే అవకాశం ఉందా..” అంటూ ప్రశ్నవేసింది. “ఆహ్వానం పంపటం మన మర్యాద.. ఆ దేశం నుంచి ఎవరైనా వచ్చినా రాకపోయినా ఇక్కడ పట్టించుకునే వాళ్ళెవరూ లేరు” అంటూ జైశంకర్ ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టేశారు. పాకిస్తాన్ నుంచి ఎవరూ రారనే అంతా అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి భిలావల్ భుట్టో జర్దారీ భారత్ రానే వచ్చాడు. “ప్రజలంతా ఆకలితో చస్తుంటే మీరు ఇప్పుడు భారత్ వెళ్ళాల్సిన అవసరం లేదు” అంటూ పాకిస్తాన్ మత పెద్దల నుంచి ఆ దేశ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు అందినప్పటికీ.. వాటిని లెక్క చేయకుండా జర్దారీ భారత్ వచ్చాడు. సమావేశానికి వచ్చిన జర్దారీకి కనీసం షేక్ హాండ్ కూడా ఇవ్వలేదు మన మంత్రి జై శంకర్. దూరం నుంచే దండం పెట్టేసి అలా వెళ్ళి కూర్చోమంటూ సైగ చేశాడు. సరే ఎలాగూ వచ్చాడు.. వచ్చినోడు టీ కాఫీలు తాగేసి.. పెట్టిందేదో తినేసి మళ్ళీ విమానమెక్కి వెళ్ళిపోవచ్చు కదా.. అలా చేయలేదు పాక్ మంత్రి..! బింకానికి పోయి మన మంత్రి జై శంకర్ తో పాటు మీడియా సమావేశానికి హాజరయ్యాడు. పోనీ ఇక్కడైనా నోరు మూసుకొని కూర్చుంటే పోయేది కదా.. కశ్మీర్ అంశాన్ని కెలికి అందరి ముందూ జై శంకర్ నోటి నుంచి అనరాని మాటలు అనిపించుకున్నాడు. “మనం కశ్మీర్ సమస్యను చర్చించుకొని పరిష్కరించుకుందాం.. భారత్ కశ్మీర్ విషయంలో తన వైఖరి మార్చుకోవాలి.. ఎస్ సీ ఓ సమావేశాన్ని శ్రీనగర్ లో నిర్వహించటం పట్ల మాకు అభ్యంతరం ఉంది..” అంటూ భారత విధానాన్ని ప్రంపచ దేశాల ముందు తప్పుబట్టే ప్రయత్నం చేశాడు. జర్దారీ మాటలకు మండిపోయిన జైశంకర్.. “తీవ్రవాదులతో ఎవరైనా మాట్లాడుతారా.. కేవలం ఎదురిస్తారు.. యుద్ధం చేస్తారు.. దేశాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారే తప్ప చర్చలు చేయరు.. టెర్రరిజాన్ని పుట్టించే దేశానికి నువ్వు ప్రతినిథి నా దృష్టిలో..” అంటూ ఈడ్చి కొట్టినట్టు అందరి ముందు చెప్పేశాడు. “అసలు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.. భారత్ ముందు ఆ దేశం పరపతి ఏంటి..” అంటూ ఘాటు ప్రశ్నలు వేశాడు మీడియా ముందు. అలా భారత్ ను బద్నాం చేయాలని ప్రయత్నించి భంగపడ్డాడు జర్దారీ.
అంతర్జాతీయ మీడియా ముందు పరువు పోగొట్టుకున్నా.. జర్దారీకి బుద్ధి రాలేదు. అందుకే అదే రోజు భారత మీడియా చానళ్ళకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో జర్దారీ మరోసారి “కశ్మీర్ విషయంలో భారత విధానం తప్పు” అంటూ వ్యాఖ్యానించాడు. “పాకిస్తాన్ తో చర్చించి కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలి.. ఇందుకు మేం ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం” అంటూ చెప్పుకొచ్చాడు జర్దారీ. ఈ వ్యాఖ్యలు మెన్షన్ చేస్తూ ఇంటర్నేషనల్ మీడియా ప్రతినిథులు మళ్ళీ జై శంకర్ ను ప్రశ్నించారు. “కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ తో భారత్ స్టాండ్ ఏమిటి” అంటూ ప్రశ్నించిన మీడియా ప్రతినిథులకు.. “మా స్టాండ్ ఏమీ లేదు.. ముందు పాకిస్తాన్ పీఓకేను ఎప్పుడు ఖాళీ చేస్తుందో చెప్పాలి.. అప్పుడే ఆ దేశం విషయంలో భారత్ ఏదైనా స్టాండ్ తీసుకుంటుంది.. ఎప్పుడు పీఓకే వదిలి వెళ్ళిపోతారో అడగండి..” అంటూ ఊహించని కౌంటర్ ఇచ్చాడు జై శంకర్. అనవసరంగా కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి ప్రపంచం ముందు పాకిస్తాన్ పరువు తీసినందుకు.. భారత్ తో తిట్లు తిట్టించినందుకు పాపం జర్దారీకి ఇంటా బయటా చీవాట్లు తప్పలేదు. పాకిస్తాన్ తిరిగి వెళ్ళిన జర్దారీకి మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. తన బదులు హీనా రబ్బానీని భారత్ పంపి ఉండాల్సింది అంటూ తన అధికారులతో తన బాధ చెప్పుకున్నాడట జర్దారీ. జై శంకర్ ఇచ్చిన కౌంటర్లకు ఓ వారం పాటు నిద్ర ఉండదు ఆ దేశ ప్రధానమంత్రికి, సైన్యాధికారులకు. అసలే అడుక్కుతింటున్న పరిస్థితి.. సాయం చేయమంటూ ఏ దేశ ప్రధానిని కాళ్ళా వేళ్ళా బతిమిలాడినా “ఛీ పొండి అవతలికి” అనే సమాధానమే తప్ప మరో మాట వినిపించటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ తన మంత్రిని భారత్ కు పంపించటం ఎందుకు..? అతడు వచ్చి వివాదాస్ఫద అంశాన్ని కెలకటం ఎందుకు..? మరోసారి ప్రపంచం చేత ఛీ కొట్టించుకోవటం ఎందుకు..? యుద్ధాన్ని ఏమాత్రం ఎదుర్కునే పరిస్థితుల్లో ప్రస్తుతం పాకిస్తాన్ లేదు. అత్యంత బలహీనంగా ఉన్న పాకిస్తాన్ నుంచి కశ్మీర్ ను స్వాధీనం చేసుకోవటం భారత్ కు కష్టమైన విషయమేమీ కాదు. అయినా సరే ఏ దేశంపైనా తమంతట తామే మొదటగా యుద్ధం మొదలుపెట్టవద్దన్న శాంతి నిబంధనను భారతదేశం పాటిస్తోంది కనుక పాకిస్తాన్ ఇంకా అలా ఉంది. కేంద్రం ప్రభుత్వం నిజంగా కశ్మీర్ ను స్వాధీనం చేసుకోవాలని నిశ్చయించుకుంటే కనుక.. చైనా, అమెరికా సహా ప్రకపంచంలో ఏ దేశమూ భారత్ ను నిలువరించలేదు. ఎందుకంటే.. కశ్మీర్ అనేది భారత అంతర్గత సమస్య. తమ పరిస్థితి ఏమిటో ఆలోచించి వ్యవహరించాలనే కనీస జ్ఞానం లేని వెధవలు పాకిస్తాన్ ను పరిపాలిస్తున్నారు. ఇది ఆ దేశ ప్రజలు చేసుకున్న దురదృష్టం తప్ప మరొకటి కాదు.

FOLLOW US

More like this

“We Have to Listen to the ISI”: Pakistan Defence Minister Makes Candid Remarks

Pakistan's political system has long been the subject of debate, with critics alleging that...

Big News for IPL Fans: BCCI Reportedly Considering Major Scheduling Change

Cricket enjoys immense popularity in India, with the Indian Premier League (IPL) being one...

Social Media Speculation Over Missing Child Draws Criticism

In the race for views and subscribers, many social media users are resorting to...