HomeFILM NEWSఇది రామాయణమా.. రివేంజ్ డ్రామానా..!? ఓం రౌత్ పైత్యమా ?

ఇది రామాయణమా.. రివేంజ్ డ్రామానా..!? ఓం రౌత్ పైత్యమా ?

Published on

Latest articles

Good News for Vijay: Jana Nayagan Set for Release After Censor Clearance

Tamil superstar Thalapathy Vijay's much-awaited final film, Jana Nayagan, is finally expected to hit...

E20 Petrol May Reduce Mileage, Government Clarifies the Facts

The Central Government has acknowledged that using E20 petrol (fuel blended with 20% ethanol)...

ఆదిపురుష్ సినిమాలో అన్నీ తప్పులే చూపించారంటూ సోషల్ మీడియా దద్దరిల్లిపోతున్నది. సినిమాలో అసలు విషయం కంటే ఓం రౌత్ పైత్యమే ఎక్కువగా కనిపించిందంటూ విమర్శకులు భగ్గుమంటున్నారు. ఎవరు రాసిన రామాయణాన్ని ఆధారంగా చేసుకొని ఓం రౌత్ ఈ సినిమా తీశాడో చెప్పాలంటూ కోర్టుల్లో కేసులు నమోదవుతున్నాయి. హిందూ సంఘాలైతే ఏకంగా సినిమాను ప్రదర్శించటం ఆపేయాలంటూ కేసులు వేస్తున్నాయి. సినిమాలో ఒక్క విషయం కూడా సరిగ్గా చూపించలేదనీ.. ఎవరి ఇష్టమొచ్చినట్టుగా వాళ్ళు రామాయణాన్ని మార్చేస్తే చూస్తూ ఊరుకోమంటూ పలు సంఘాలు ఓం రౌత్ ను హెచ్చరిస్తున్నాయి. ఆదిపురుష్ విడుదలై ఒక్క రోజే అయ్యింది. మరుసటి రోజు నుంచే కేసులు పెట్టడం జరుగుతోంది. అయితే.. ఓం రౌత్ చేసింది తప్పేనా..? సినిమాకు తగినట్టు రామాయణ గాధను మార్చేయటం సరైనదేనా..? విమర్శకుల విమర్శల్లో పస ఉందా..?

వాల్మీకి మహర్షి రాసిన రామాయణం అనేది మిగతా రామాయణాలకు ఆధారం. అనేక మంది కవులు రామాయణాన్ని అనువదించారు.. మళ్ళీ రాశారు.. కానీ మాతృక అయినటువంటి వాల్మీకి రామాయణాన్ని మార్చే ప్రయత్నం చేయలేదు. మొల్ల రాసిన మొల్ల రామాయణం, గోనబుద్ధారెడ్డి రాసిన రంగనాథ రామాయణం, తిక్కన సోమయాజి రాసిన నిర్వచనోత్తర రామాయణం.. ఇలా ఎంతో మంది కవి సార్వభౌములు రామాయణాన్ని మళ్ళీ రాశారు.. కానీ మూలాన్ని మార్చే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే.. రామాయణాన్ని రాయాలనే వారి సంకల్పంలో తమ కవితా ప్రజ్ఞను చాటుకోవాలనే ఆశ కావచ్చు.. లేదా మహోత్తర రామాయణ గాధను తాము రాశామన్నది చరిత్రలో నిలిచిపోవాలన్న కోరిక కావచ్చు.. కానీ స్వప్రయోజనం మాత్రం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. రాముడంటే తండ్రిమాట జవదాటని ధర్మనిష్ట. రాముడంటే సీతను తప్ప పర స్త్రీ నీడను కూడ తాకనంత పత్నీవ్రత్యం. రాముడంటే నమ్మిన ధర్మం కోసం రాజ్యాన్ని త్యజించి అడవికి వెళ్ళిన కర్మాచరణ కర్త. రాముడంటే జనం మాట కోసం ప్రాణ సఖిని అరణ్యం పాలు చేసిన పాలనోత్తముడు. రాముడంటే కష్టం తప్ప సుఖం తెలియని జీవితాన్ని అనుభవించిన త్యాగి. ఇలా చెప్పుకుంటూ పోతే రామ లక్ష్మణులు, సీత, హనుమంతుడు.. లేక మరే పాత్ర అయినా.. అది కేవలం మనల్ని ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదనే జీవిత నిర్దేశం చేసేదే.

చరిత్రలో ఏ కవి కూడా రామాయణాన్ని తనకు ఇష్టం వచ్చినట్టు మార్చలేదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. రావణుడు సీతను అపహరించి పతనమయ్యాడే తప్ప అతడు గొప్ప శివభక్తుడు. లంకా సామ్రాజ్యం నిత్యం కళకళలాడే సువర్ణ మందిరాల నిలయం. రావణుడు ఇంద్రాది దేవతలను ఓడించిన వీరుడు. కానీ ఆదిపురుష్ లో లంక ఓ భూత్ బంగ్లా..! రావణుడు నీతి లేని ఓ క్రూరుడు..! శివుడి పేరే ఎత్తని రాక్షసుడు..!! ఇలా చూపించటం సబబేనా ఎవరికైనా..? సీత అనుమతి లేనిది ఎవరైనా సరే ఆమెను తాకితే బూడిద అయిపోవాల్సిందే.. అందుకే రావణుడు ఆమె నిలబడిన భూమితో సహా పెకిలించి అపహరించాడు.. ఇది చిన్న పిల్లలకు కూడా తెలిసిన విషయం. కానీ ఆదిపురుష్ లో ఓం రౌత్ ఏం చూపించాడో మనం చూశాం. నిత్యం శ్రీరామనామం వెలువడే హనుమంతుడి నోట బూతులా..? ఏమిటిది పైత్యం కాకపోతే..! సీతను విడువమని హనుమంతుడు రావణుడికి ఎలా చెప్పాడో తెలుసా.. “ఓయి మూర్ఖపు రాజా.. సీతమ్మ తల్లిని అపహరించటం పతనానికి నాంది అని తెలియనివాడా..! చేసిన అపరాధానికి చెంపలు వేసుకొని సీతమ్మ వారిని నా దేవుడు శ్రీరాముడికి అప్పగించి.. ఆ రాముని పాదాలను ఆశ్రయించు..!” అని. కానీ ఆదిపురుష్ లో హనుమంతుడు ఏం చెప్తున్నాడో సోషల్ మీడియాలో కనిపిస్తోంది అద్భుతంగా. లంకా దహనం చేసిన హనుమంతుడిని సీతమ్మ.. “హనుమా.. నిన్ను శ్రీరాముడు లంకకు వెళ్ళి చూసి రమ్మన్నాడా.. కాల్చి రమ్మన్నాడా..” అని ప్రశ్నించింది. అందుకు హనుమంతుడు ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా.. “తల్లీ.. ఎవరు పెట్టిన చిచ్చు వారినే దహించును..” ఆదిపురుష్ లో చూపించిన పద్ధతి ఇదేనా..? కాదు కదా..! అలాంటప్పుడు దీన్ని పైత్యం అనటంలో తప్పేమీ లేదు మరి. శ్రీరాముడి గురించి ప్రపంచమంతా తెలియాలంటూ పదే పదే చెప్పుకొచ్చిన ఓం రౌత్.. ముందు తాను శ్రీరాముడి గురించి తెలుసుకుంటే బాగుండేది. యావత్ ప్రపంచం ముందు రామాయణ గాధను రివేంజ్ డ్రామా చేసేశాడు ఓం రౌత్. దాని కోసం రామయణమే దొరికిందా..? రాయలసీమ ఫ్యాక్షన్ కథ తీస్తే సరిపోయేది కదా..! ఇష్టమొచ్చినన్ని మాస్ పంచ్ డైలాగ్స్ తో పాటు కావాల్సినన్ని బూతులు రాసుకోవచ్చు. ముమ్మాటికీ ఓం రౌత్ చేసింది నూటికి వెయ్యి శాతం తప్పే. సో.. ఫైనల్ గా చెప్పొచ్చేది ఏమిటంటే.. ప్రభాస్ కోసం ఆదిపురుష్ చూస్తామని చెప్పే అభిమానులని వదిలేయాలి… అది వారి అభిమానం. కానీ రామాయణం కోసమో, శ్రీరాముడి కోసమో ఆదిపురుష్ చూస్తామంటే మాత్రం.. అస్సలు వద్దు. అలా చూస్తే మనమే మూర్ఖులమవుతాం అనేది నిజం..!!

FOLLOW US

More like this

Good News for Vijay: Jana Nayagan Set for Release After Censor Clearance

Tamil superstar Thalapathy Vijay's much-awaited final film, Jana Nayagan, is finally expected to hit...

E20 Petrol May Reduce Mileage, Government Clarifies the Facts

The Central Government has acknowledged that using E20 petrol (fuel blended with 20% ethanol)...

Why PM Modi Visited Indonesia’s Prambanan Temple: A Symbol of Shared Civilizational Heritage

Prime Minister Narendra Modi's visit to the Prambanan Temple in Indonesia has drawn global...