Home TELANGANA భారత్ న్యూజీలాండ్ మ్యాచ్ ఎఫెక్ట్

భారత్ న్యూజీలాండ్ మ్యాచ్ ఎఫెక్ట్

0
భారత్ న్యూజీలాండ్ మ్యాచ్ ఎఫెక్ట్

హైదరాబాద్ వాసులకు పోలీసుల అలర్ట్

భారత్ న్యూజీలాండ్ మధ్య 3 వన్డేల సిరీస్ లో భాగంగా ఫస్ట్ మ్యాచ్ హైదరాబాద్ లో జరగనున్న విషయం తెలిసిందే. రేపు జరగనున్న తొలి మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియం రెడీ అయ్యింది. అయితే.. మ్యాచ్ కు క్రికెట్ అభిమానులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు హైదరాబాద్ సిటీలో పలు ట్రాఫిక్ ఆంక్షలు, డైవర్షన్లు చేయనున్నారు. సోమాజీగూడ నుంచి ఉప్పల్ వరకూ చాలా చోట్ల డైవర్షన్లు ఉంటాయని హైదరాబాద్ పోలీసులు చెప్పారు. మ్యాచ్ చూసేందుకు ఉదయం నుంచే సిటీ లోని అన్ని ప్రాంతాల నుంచీ ఉప్పల్ కు ప్రేక్షకులు బయల్దేరతారనీ.. కాబట్టి ఆయా రూట్లలో రద్దీ ఉంటుందని కమిషనర్ చెప్పారు.

మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు కాబట్టి.. అంతకు ముందు సోమాజీగూడ-ఉప్పల్ మధ్య ప్రయాణించే వారు వేరే దారిలో వెళ్ళటం మంచిదని.. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఓ గంట ముందు బయల్దేరాల్సి వస్తుందని చెప్పారు. ట్రాఫిక్ క్లియర్ చేయటానికి పోలీసులు ఎక్కడైనా వాహనాలను అపేసే అవకాశం ఉంది. కాబట్టి.. క్రికెట్ మ్యాచ్ వల్ల రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. డైవర్షన్లూ గుర్తు పెట్టుకుంటే లోకల్ జనానికి మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here