Home SPORTS డబుల్ సెంచరీతో రెచ్చిపోయిన గిల్ : భారత్ భారీ స్కోర్

డబుల్ సెంచరీతో రెచ్చిపోయిన గిల్ : భారత్ భారీ స్కోర్

0
డబుల్ సెంచరీతో రెచ్చిపోయిన గిల్ : భారత్ భారీ స్కోర్

హైదరాబాద్ లో జరుగుతున్న భారత్ వర్సెస్ న్యూజీలాండ్ ఫస్ట్ వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 349 పరుగుల భారీ స్కోరు సాధించి కివీస్ జట్టు ముందు 350 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ శుభ్మాన్ గిల్ రెచ్చిపోవటంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది. 145 బాల్స్ లో 19 ఫోర్లు, 9 సిక్సర్లతో గిల్ 208 పరుగుల కెరీర్ బెస్ట్ స్కోర్ సాధించటంతో పాటు.. డబుల్ సెంచరీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. డబుల్ సెంచరీ ముంగిట ఏమాత్రం భయం లేకుండా 3 వరుస సిక్సర్లు బాది డబుల్ సెంచరీ రికార్డును సొంతం చేసుకున్నాడు గిల్. మరో ఓపెనర్ రోహిత్ శర్మ 34, సూర్య కుమార్ యాదవ్ 31 మినహా మిగితా బ్యాట్స్ మెన్ ఎవ్వరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. ఒంటరి పోరాటం చేసిన గిల్ ఇన్నింగ్స్ వల్ల భారత్ భారీ స్కోరు సాధించగలిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here