HomeINTERNATIONAL NEWSజైశంకర్ సమాధానం ఇలా ఉంటుందని యూరప్ ఊహించలేదు

జైశంకర్ సమాధానం ఇలా ఉంటుందని యూరప్ ఊహించలేదు

Published on

Latest articles

“We Have to Listen to the ISI”: Pakistan Defence Minister Makes Candid Remarks

Pakistan's political system has long been the subject of debate, with critics alleging that...

Big News for IPL Fans: BCCI Reportedly Considering Major Scheduling Change

Cricket enjoys immense popularity in India, with the Indian Premier League (IPL) being one...

Social Media Speculation Over Missing Child Draws Criticism

In the race for views and subscribers, many social media users are resorting to...

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధానికి ముగింపు అసాధ్యమని తేలిపోయింది. ఎప్పుడైతే కీవ్ డ్రోన్ మాస్కో వైపు వెళ్లిందో ఆ క్షణమే క్రెమ్లిన్ మిస్సైళ్లు కీవ్‌ను టార్గెట్ చేశాయి. సింపుల్‌గా చెప్పాలంటే సరిహద్దుల్లో కొట్లాట కాస్తా అధ్యక్షుల మధ్య ఫేస్ టూ ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్ అన్నట్టుగా మారిపోయింది. ఇందులో భాగంగానే యుద్ధ వ్యూహాలూ మారిపోతున్నాయి. ఉన్నట్టుండి ఉక్రెయిన్ అధ్యక్షుడు బ్రిటన్‌లో ప్రత్యక్ష్యం కావడం.. ఆ వెంటనే ఉక్రెయిన్‌పై మాస్కో మిస్సైళ్ల వర్షం కురవడం లాంటి పరిణామాలు యుద్ధభూమిలో ఇంకేదో జరగబోతోందనే ఉత్కంఠను రేపుతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మాస్కోను ఏవిధంగా నిలువరించలేకపోతున్నామనే భావన పశ్చిమ దేశాల్లో మళ్లీ మళ్లీ బయటపడుతోంది. యుద్ధం మొదట్లో అమెరికా సైడ్ తీసుకున్న యూరోపియన్‌యూనియన్ దేశాలు మాస్కోపై ఎడాపెడా ఆంక్షలు విధించాయి.
రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతి చేసుకోకుంటే కష్టాలు తప్పవని తెలిసి కూడా పుతిన్‌ను ఆంక్షలతో అడ్డుకునేలా యాక్షన్‌లోకి దిగాయి. దీనికి ఫలితంగా చలి పులి దెబ్బ గట్టిగానే రుచి చూడాల్సి వచ్చింది యూరోపియన్ దేశాలు.
రష్యాకు ప్రధాన ఆదాయ వనరు క్రూడాయిలే అని తెలిసిన యూరప్.. కష్టమే అయినా మాస్కో నుంచి దిగుమతులు నిలిపేస్తే ఆ ఎఫెక్ట్ పుతిన్‌పై పడుతుందనీ, ఫలితంగా యుద్ధంలో ఓడిపోతారనీ కలలు కన్నారు. కానీ, పుతిన్ మాత్రం అమెరికా సహా పశ్చిమ దేశాలకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. తనపై ఆంక్షలు విధిస్తున్న దేశాలను పరిశీలించి.. చివరికి ఇండియా, చైనా లాంటి మద్దతు దేశాలకు తక్కువ ధరకే క్రూడాయిల్ అంటూ బంపరాఫర్ ఇచ్చారు. ఈ పరిణామాన్ని అగ్రరాజ్యంతోసహా మరే ఇతర దేశం ఊహించలేదు. ఫలితంగా మాస్కోకు ఫైనాన్షియల్ ఇబ్బందులు తొలగిపోయాయి. ఈ కారణంతోనే యుద్ధాన్ని ఇంతకాలం కంటిన్యూ చేయగలుగుతున్నారు. అందుకే ఇండియాపై చాలా సందర్భాల్లో అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలు విమర్శలు చేశాయి. అయినా జైశంకర్ మాత్రం మొదట దేశ ప్రయోజనాలే తమకు ఇంపార్టెంట్ అని తేల్చి చెప్పారు. అయితే, ఇదంతా గతం. ఈ విషయంలో అమెరికా సహా అన్ని దేశాలూ సైలెంట్ అయిపోయాయి అనుకుంటున్న సమయంలో ఈయూ మళ్లీ తన కడుపుమంటను బయటపెట్టుకుంది.
భారత్ రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న చమురును.. శుద్ధి చేసిన చమురు పేరిట యూరోపియన్‌ యూనియన్‌కు అమ్ముతుందని ఈయూ చీఫ్‌ దౌత్యవేత్త జోసెఫ్‌ బొర్రెల్ ఆక్షేపించారు. దీనికి అడ్డుకట్ట వేయాలని ఆయన ఫైనాన్షియల్‌ టైమ్స్‌కు చెప్పారు. భారతీయ చమురు శుద్ధి కంపెనీలు పెద్ద మొత్తంలో రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుని అటు నుంచి యూరోపియన్‌ యూనియన్‌కు తరలిస్తున్నాయని బోరెల్‌ అన్నారు. రష్యా చమురు దిగుమతిపై ఉన్న ఆంక్షలను తప్పించుకోవడానికి ఈ మార్గాన్ని అనుసరిస్తున్నాయని విమర్శించారు. ఇందులో డీజిల్‌ ఎగుమతులు కూడా ఉన్నట్టు ఆయన అన్నారు. ‘రష్యా తక్కువ ధరకు అమ్మవచ్చు. ఇండియా కొనవచ్చు. అది వారిరువురి పరస్పర ప్రయోజనం. కానీ అదే చమురు యూరోపియన్‌ యూనియన్‌కు అమ్మడం అంటే ఆంక్షలను వమ్ము చేయడమే’ అంటూ జోసెఫ్ మరోసారి ఏడ్చాడు మీడియా ముందు. ఫైనాన్షియల్ టైమ్స్‌తో ఈయూ చీఫ్‌ దౌత్యవేత్త చేసిన వ్యాఖ్యలు భారతవి దేశాంగ మంత్రి జైశంకర్ చెవిన పడ్డాయి. ఇంకేముంది.. ఈ ఎపిసోడ్‌పై తన మార్క్ కౌంటర్లతో జైశంకర్ విరుచుకుపడ్డారు. బంగ్లాదేశ్, స్వీడన్, బెల్జియం దేశాల్లో పర్యటిస్తున్న జైశంకర్.. బెల్జియంలోని బ్రసెల్స్‌లో యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగానే యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ నిబంధనలను చూసుకోవాలని సలహా ఇచ్చారు.
రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు జైశంకర్ ఇచ్చిన ఆన్సర్ ఇదే. రష్యన్ క్రూడాయిల్‌ భారత దేశంలో పూర్తిగా మారుతోందనీ, ఒక్కసారి ఇండియాకు వచ్చిన తర్వాత ఆ క్రూడాయిల్‌ను రష్యన్ చమురుగా ఎంత మాత్రం పరిగణించరని చెప్పారు. యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ రెగ్యులేషన్స్‌లోని రెగ్యులేషన్ 833/2014ను ఓసారి పరిశీలిస్తే మీకే క్లారిటీ వస్తుందనేలా కౌంటరిచ్చారు. జైశంకర్ కౌంటర్ తర్వాత విషయం సీరియస్ అవుతుందని గ్రహించిన యూరోపియన్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మార్గరెత్ వెస్టాజర్.. ఆంక్షలకు చట్టబద్ధత ఉండటంపై సందేహాలు లేవంటూ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. యూరోపియన్ యూనియన్, ఇండియా మిత్రులుగా చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. కరచాలనం చేసే చేయిగా ఈ చర్చలు జరుగుతాయని, వేలెత్తి చూపించే విధంగా జరగబోవని చెప్పారు.
మాస్కోపై పశ్చిమదేశాల ఆంక్షల లక్ష్యం నేరవేరాలన్న ఆలోచనతోనే రష్యాతో వాణిజ్య సంబంధాలను కనిష్ట స్థాయికి తగ్గించాలని భారత దేశంపై పాశ్చాత్య దేశాలు ఒత్తిడి తెస్తున్నాయని జైశంకర్ గతంలో కూడా విమర్శించారు. రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకోవడాన్ని సమర్థించారు. యూరోపియన్ యూనియన్ తన సొంత ఇంధన అవసరాలకు ప్రాధాన్యం ఇచ్చుకుంటూ, అదే సమయంలో భారత్ వేరొక విధంగా వ్యవహరించాలని కోరుతోందని, ఇది చాలా ఆశ్చర్యంగా ఉందని చాలా సందర్భాల్లో బహిరంగంగానే విమర్శించారు. ఈ విషయాన్ని కాస్త పక్కనపెడితే.. మాస్కోతో క్రూడాయిల్ డీల్స్‌ అనేది పూర్తిగా భారత్ అంతర్గత విషయం.. ఈ అంశంలో ఇండియాను విమర్శించే హక్కు మరే ఇతర దేశానికీ లేదు. అలాగే మనదేశం నుంచి క్రూడాయిల్ కొనితీరాలని యూరోపియన్ దేశాలను ఎవరూ బలవంతం చేయడం లేదు కూడా. వద్దనుకుంటే ఇండియా నుంచి క్రూడాయిల్ దిగుమతులు ఈయూ దేశాలు ఎప్పుడైనా నిలిపేసుకోవచ్చు. అలా కాదని ఇలా విమర్శలకు దిగడం వల్ల జైశంకర్ నుంచి ఊహించని కౌంటర్ వస్తుందని పాపం జోసెఫ్ మరిచిపోయినట్టున్నాడు.. అందుకు ఫలితం తాను అనుభవించటమే కాకుండా.. మొత్తం యూరప్ పరువు తీయించాడు దగ్గరుండి మరీ.

FOLLOW US

More like this

“We Have to Listen to the ISI”: Pakistan Defence Minister Makes Candid Remarks

Pakistan's political system has long been the subject of debate, with critics alleging that...

Big News for IPL Fans: BCCI Reportedly Considering Major Scheduling Change

Cricket enjoys immense popularity in India, with the Indian Premier League (IPL) being one...

Social Media Speculation Over Missing Child Draws Criticism

In the race for views and subscribers, many social media users are resorting to...