Home FILM NEWS డిలీట్ చేసిన డేటా కావాలి : సుశాంత్ సింగ్ కేసులో సీబీఐ ప్రకటన

డిలీట్ చేసిన డేటా కావాలి : సుశాంత్ సింగ్ కేసులో సీబీఐ ప్రకటన

0
డిలీట్ చేసిన డేటా కావాలి : సుశాంత్ సింగ్ కేసులో సీబీఐ ప్రకటన

బాలీవుడ్ యంగ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మూడేళ్ళ క్రితం తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఇది సంచలనంగా మారింది. అద్భుతమైన కెరీర్, మంచి ట్యాలెంట్ ఉన్న నటుడు సడన్ గా ఆత్మహత్య చేసుకోవటంపై అప్పట్లో ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. సుశాంత్ ది ఆత్మహత్య కాదనీ.. డ్రగ్ మాఫియా సుశాంత్ ను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించిందంటూ చాలా ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత దీనిపై కేసు నమోదు చేసింది సీబీఐ. 2020 జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకోగా.. సుమారు మూడేళ్ళుగా సుశాంత్ కేసు విచారిస్తున్నా.. ఇప్పటికీ ఈ కేసులో ఒక్క అంశంపై కూడా సీబీఐ క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా.. సుశాంత్ కేసులో అతడి పర్సనల్ డేటా కోసం ఎదురు చూస్తున్నామనీ.. అతడి ఫోన్లలో డిలీట్ చేసిన గూగుల్ సహా ఇతర అకౌంట్లకు సంబంధించిన డిలిటెడ్ డేటా దొరికితేనే ఈ కేసులో ముందుకు వెళ్ళ గలమనీ సీబీఐ అధికారులు చెప్తున్నారు. డిలీటెడ్ డేటా కోసం ఆయా సంస్థలను చట్టబద్ధంగా సంప్రదించామనీ.. అనేక ప్రయత్నాలు చేస్తున్నామనీ చెప్తున్నారు.

అమెరికాలో హెడ్ ఆఫీసులు గల గూగుల్, ఫేస్ బుక్, ట్విటర్, వాట్సాప్ తదితర సంస్థలన్నింటినీ సీబీఐ సంప్రదించిందనీ.. కానీ వారి నుంచి తమకు కావాల్సిన సమాచారం రావటంలో ఇంకా ఆలస్యం జరుగుతూనే ఉందనీ సీబీఐ అధికారులు చెప్తున్నారు. అయితే.. దీనిపై మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కొద్ది రోజుల క్రితం స్పందించాడు. సీబీఐతో సహా పోలీసులు ఈ కేసులో విచారణ చేస్తున్నారనీ.. ఆధారాల కోసం అన్వేషణ జరుగున్నదనీ చెప్పాడు. సుశాంత్ సంఘటన జరిగిన సమయంలో ఉన్న పరిస్థితులు మరియు కొంత మంది స్థానికులు ఇతరులు చెప్పిన సాక్ష్యాల చుట్టూ విచారణ జరుగుతోందనీ.. కేవలం ఆరోపణలను మూలంగా చేసుకొని ఎవరినీ విచారణ చేయలేమనీ ఫడ్నవీస్ చెప్పాడు. ప్రస్తుతం విచారణ జరుగుతున్నందున.. ఈ కేసుపై ఇంకా ఎక్కువ మాట్లాడటం సరికాదంటూ దాటేవేశాడు ఫడ్నవీస్. సుశాంత్ విషయంలో బాలీవుడ్ కు చెందిన చాలా మందిపైనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here