Home Uncategorized “మనల్ని చూసి దేశం సిగ్గుపడుతోంది”

“మనల్ని చూసి దేశం సిగ్గుపడుతోంది”

0
“మనల్ని చూసి దేశం సిగ్గుపడుతోంది”

రాజ్యసభలో ఉప రాష్ట్రపతి కామెంట్స్

జగదీప్ ధన్ కర్

భారత ఉప రాష్ట్రపతి.. రాజ్య సభ సభాపతి జగదీప్ ధన్ కర్ నోటి నుంచి వచ్చిన మాట.. పెద్ద చర్చకు దారితీసింది. రాజ్య సభ జరుగుతున్న తీరుపై మండిపడిన ఆయన.. ఓ దశలో సభ్యల ప్రవర్తన పట్ల తీవ్ర అసహనానికి లోనై ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతకూ ఈ పరిస్థితి రావటానికి అసలు కారణం ఏమిటంటే..

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుకు మల్లిఖార్జున్ ఖర్గే రాజస్తాన్ లో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో పాల్గొని మాట్లాడుతూ.. ఓ అభ్యంతరకమైన వ్యాఖ్య చేశాడు. దేశం కోసం రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ తమ ప్రాణాలను త్యాగం చేశారనీ.. బీజేపీ నేతల ఇళ్ళలోంచి ఒక కుక్క కూడా దేశం కోసం మరణించలేదంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. దీనిపై బీజేపీ నేతలు ఫైరయ్యారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ రాజ్యసభలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. వెంటనే ఖర్గే క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేయగా.. సభ బయట జరిగిన విషయంపై సభలో చర్చ అనవసరమనీ.. తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదనీ ఖర్గే తేల్చి చెప్పాడు. దీంతో రాజ్యసభ రసాభాసగా మారింది. సభ్యులు శాంతించాలనీ.. ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలంటూ జగదీప్ ధన్ కర్ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సభ్యులు పట్టించుకోకుండా గొడవకు దిగారు. దీంతో అసహనానికి గురైన సభాధ్యక్షుడు.. “సభ జరిగే తీరు ఇదేనా.. మన ప్రవర్తన చూస్తే దేశంలోని 135 కోట్ల మంది ప్రజలు నిరుత్సాహానికి గురవుతారు.. దేశం మనల్ని చూసి సిగ్గుపడే పరిస్థితి వస్తుంది..” అంటూ తీవ్రంగా స్పందించారు. తీవ్ర అసహనంతో ధన్ కర్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపజేశాయి. కోట్ల కొద్దీ ప్రజాధనం వెచ్చించి నిర్వహించే పార్లమెంట్ సమావేశాల్లో ప్రజాసమస్యలు, దేశ అభివృద్ధి గురించి కాకుండా.. అనవసరమైన విషయాలపై చర్చించటం సరైనది కాదనే అభిప్రాయం వినిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here