Home NATIONAL NEWS ఐదేళ్ళు పూర్తిగా సిద్దరామయ్యే ముఖ్యమంత్రి-ఎంబీ పాటిల్

ఐదేళ్ళు పూర్తిగా సిద్దరామయ్యే ముఖ్యమంత్రి-ఎంబీ పాటిల్

0
ఐదేళ్ళు పూర్తిగా సిద్దరామయ్యే ముఖ్యమంత్రి-ఎంబీ పాటిల్

కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటై పట్టుమని పది రోజులు కాకముందే అప్పుడే సీఎం సీటు పంచాయతీ మళ్ళీ మొదటికొచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కుర్చీని వదిలిపెట్టేది లేదని భీష్మించుకొని కూర్చున్న డీకే శివకుమార్ ను కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానం ఎలాగోలా బుజ్జగించి డిప్యూటీ సీఎం పోస్టుతో సరిపెట్టింది. అంతకు ముందున్న రాజకీయ అంచనాల ప్రకారం తొలి రెండున్నరేళ్ళు సిద్దరామయ్య, ఆ తర్వాత రెండున్నరేళ్ళు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తారు. ఇందుకు అందరూ అంగీకరించినట్టు వార్తలొచ్చాయి. కేవలం ఈ ఒప్పందం మీదనే డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా ఉండేందుకు అంగీకరించాడని చెప్పారు. కానీ అందుకు భిన్నంగా ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ లో కొత్త రాజకీయ సమీకరణాలు కనిపిస్తున్నాయి. పూర్తి ఐదేళ్ళ కాలం పాటు సిద్దరామయ్య మాత్రమే ముఖ్యమంత్రిగా ఉంటాడనీ.. దీనిపై మరో మాటే లేదనీ సీనియర్ కాంగ్రెస్ నేత ఎంబీ పాటిల్ వ్యాఖ్యానించటం కర్ణాటక కాంగ్రెస్ లో మళ్ళీ కలకలం రేపింది.
పాటిల్ వ్యాఖ్యలపై డీకే శివకుమార్ తమ్ముడు డీకే సురేష్ స్పందించాడు. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడి చాలా తక్కువ రోజులు మాత్రమే గడిచిందనీ.. ఇప్పుడే భవిష్యత్తు గురించి అంత చర్చ అవసరం లేదనీ అన్నాడు. కర్ణాటకలో ఎవరు ఏ పాత్ర పోషించాలనేది నిర్ణయించుకున్న తర్వాతనే ప్రభుత్వం ఏర్పాడు అయ్యిందనీ.. ఒక వేళ మార్పులు చేర్పులు ఉంటే ఏఐసీసీ అధిష్టానం చూసుకుంటుందనీ వ్యాఖ్యానించాడు సురేష్. కర్ణాటక మంత్రి వర్గ విస్తరణ విషయంలో సిద్దరామయ్యతో పాటు డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్ళి సోనియా మరియు మల్లికార్జున ఖర్గేతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ఎంబీ పాటిల్ వ్యాఖ్యలు కాస్త గందరగోలానికి దారితీశాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here