HomeNATIONAL NEWSకర్ణాటకలో మెజార్టీ రాకపోతే..! : ప్లాన్ సిద్ధం చేసిన అమిత్ షా

కర్ణాటకలో మెజార్టీ రాకపోతే..! : ప్లాన్ సిద్ధం చేసిన అమిత్ షా

Published on

Latest articles

New Twists Await in the OTT Version of Sing Geetham

Veteran filmmaker Singeetam Srinivasa Rao, known for creating some of the most innovative films...

Do You Want a Puppy? I’ll Send One”: Pawan Kalyan Fulfills a Young Fan’s Wish

Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan met a 17-year-old fan from Warangal who...

Good News: Oil Supply Resumes; Petrol Prices May Fall

The disruption in global oil exports caused by the Middle East conflict has finally...

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయిన వేళ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు రాజకీయాన్ని మరింత రసవత్తరం చేశాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించటంతో పాటు కర్ణాటకలో పొత్తులు లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. సర్వే ఫలితాలు దాదాపుగా కాంగ్రెస్ కే ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టీ వస్తుందంటూ చెప్తున్నాయి. ఒకటి రెండు సర్వేలు మాత్రమే కాస్త బీజేపీకి వంద సీట్లు వస్తాయన్నట్టుగా చెప్తున్నాయి. అయితే కర్ణాటకలో తెరవెనుక రాజకీయం రంజుగా సాగుతోంది. ఎన్నికల ప్రచారం సమయంలో కర్ణాటకకు వచ్చిన అమిత్ షా.. ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన ఆధిత్యం రాకపోతే ఏం చేయాలో పక్కా ప్లాన్ చేసి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంలో అసలు గత 20 యేళ్ళలో కర్ణాటకలో ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.
2004లో కూడా ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు ఈ ఎన్నికల్లో లాగానే. బీజేపీకి 79 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 65 సీట్లు రాగా.. బీజేపీ కంటే తక్కువ సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ 58 సీట్లలో విజయం సాధించిన జేడీఎస్ తో కలిసి అనూహ్యంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ కొద్ది నెలల్లోనే ప్రభుత్వం కుప్పకూలిపోయి రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. కాంగ్రెస్, జేడీఎస్ రెండు పార్టీలూ కూడా తామే కర్ణాటకను ఏలాలనీ.. పాలన అధికారాలు మొత్తం తమ వద్దే ఉండాలని కోరుకుంటాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య పొసగని పొత్తు కుప్ప కూలింది. ఆ తర్వాత 2018 కూడా ఇదే తప్పు రిపీట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. పూర్తి ఆధిపత్యం తమకే దక్కాలని కోరుకునే జేడీఎస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి యేడాది తర్వాత మళ్ళీ పొత్తు బెడిసికొట్టి ప్రభుత్వం రద్దు అయ్యింది.
ఎగ్జిట్ పోల్ అంచనాలను ఓసారి పరిశీలిస్తే.. ఈ సారి కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి రావాల్సిన 113 సీట్ల పూర్తి ఆధిక్యత రానున్నట్టు కనిపించటం లేదు. పైగా ఈ సారి కూడా జేడీఎస్ 30కి పైగా సీట్లతో కింగ్ మేకర్ అయ్యే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. కానీ ఈసారి జేడీఎస్ తో పొత్తు పెట్టుకొని ప్రభుత్వ ఏర్పాటు జరుగుతుందా లేదా అనేదే అసలు విషయం. 25 సీట్లు వస్తే చాలు తన కొడుకును సీఎం చేయటానికి ఎత్తులు వేస్తున్నాడు కుమారస్వామి తండ్రి దేవెగౌడ. అటు కాంగ్రెస్ ముందు ఇటు బీజేపీ ముందు ఒక్కటే డిమాండ్ పెట్టేసాడు.. అది తన కొడుకును సీఎం చేయాలని. 90 నుంచి 100 సీట్లు సాధించిన పార్టీ ఏదైనా 25 సీట్లు సాధించిన పార్టీకి సీఎం పదవి ఇస్తుందా.. అదీ ఇక్కడ అసలు సమస్య.
కాంగ్రెస్ కు పూర్తి ఆధిక్యత రాకపోతే అనే సంగతి పక్కన పెడితే.. కాంగ్రెస్ కు 120 సీట్లు వచ్చినా ఇక్కడ ముఖ్యమంత్రి పదవి చాలా పెద్ద సమస్య అవుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి సిద్దరామయ్య సీఎం కాకూడదనేది డి శివకుమార్ బలమైన కోరిక. తానే సీఎం సీటు ఎక్కాలని చాలా పట్టుదలతో ఉన్నాడు శివకుమార్. కానీ కాంగ్రెస్ సోనియా, రాహుల్ మాత్రం సిద్దరామయ్య వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే శివకుమార్ కు ప్రియాంక గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే ఆశీర్వాదాలున్నాయి. ఇలా కాంగ్రెస్ లోనే రెండు వర్గాల మధ్య సీఎం సీటు పై ఆశ ఉండగా.. తాను చచ్చేలోగా కుమారస్వామిని సీఎంగా చూడాలని ఎంతటి రాజకీయమైన చేయటానికి దేవెగౌడ సిద్ధంగా ఉన్నాడు. ఇదీ కర్ణాటక ముఖ్యమంత్రి కుర్చీ పరిస్థితి.
ఇక్కడే ఎవరూ ఊహించని ఓ సీన్ జరగబోతోంది. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి అమిత్ షా వచ్చిన మొదటి రోజే రాత్రి 2 గంటలకు రహస్యంగా శివకుమార్ అమిత్ షా తో భేటీ అయ్యాడు. కేవలం 10 నిముషాల పాటు జరిగిన ఈ భేటీలో భవిష్యత్తు గురించి స్కెచ్ రెడీ అయిపోయింది. 2018లో కుమారస్వామి ప్రభుత్వాన్ని సిద్ధరామయ్య ఎలగైతే పడగొట్టి కాంగ్రెస్ ను అధికారానికి దూరం చేశాడో ఇప్పుడు అందుకు ప్రతీకారంగా శివకుమార్ అదే పని చేయబోతున్నాడన్నమాట. తనకు ముఖ్యమంత్రి పదవి దక్కని పరిస్థితుల్లో శివకుమార్ తన సొంత పార్టీ అయిన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను బీజేపీలో చేరేందుకు డీల్ సెట్ చేస్తాడు.. భారీ ఆఫర్లతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మద్దతు ఇస్తారు. అలా బీజేపీ అధికారంలోకి వస్తుంది.. ఇందుకు బహుమతిగా శివకుమార్ ను అక్రమ ఆస్తుల కేసులో విచారిస్తున్న సీబీఐ.. అరెస్టు చేయకుండా ఉంటుంది. ఒక వేళ సిద్దరామయ్య కాకుండా శివకుమార్ సీఎం అభ్యర్థి అయితే బీజేపీ జేడీఎస్ ను కలుపుకోటానికి ప్రయత్నిస్తుంది. ఎటూ వచ్చి.. ఈసారి కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదు అనేది బీజేపీ ప్లాన్. కర్ణాటకో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వచ్చే ఎన్నికలకు కావాల్సిన డబ్బును సమకూర్చుకోగలుగుతుంది. ఇదే జరిగితే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మళ్ళీ పుంజుకుంటుంది. ఇది బీజేపీకి ఏమాత్రం ఇష్టంలేదు.. ఉండదు. సో.. కర్ణాటకలో కాంగ్రెస్ ను అధికారంలోకి రాకుండా అడ్డుకుంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడుతుంది. ఈసారి కాంగ్రెస్ ఓడిపోతే దేశంలో కాంగ్రెస్ దాదాపు తుడిచిపెట్టుకుపోయినట్టే. బీజేపీకి కావాల్సింది కూడా అదే. సో.. కర్ణాటకలో స్కెచ్ వేస్తే ఢిల్లీ కుర్చీ కింద భూకంపం రావటంతో పాటు వందేళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నామరూపాల్లేకుండా పోతుంది. ఇదీ.. కంటికి కనిపించని తెరవెనుక జరుగుతున్న అసలు రాజకీయం. చూద్దాం.. ఏం జరుగుతుందో.

FOLLOW US

More like this

New Twists Await in the OTT Version of Sing Geetham

Veteran filmmaker Singeetam Srinivasa Rao, known for creating some of the most innovative films...

Do You Want a Puppy? I’ll Send One”: Pawan Kalyan Fulfills a Young Fan’s Wish

Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan met a 17-year-old fan from Warangal who...

Good News: Oil Supply Resumes; Petrol Prices May Fall

The disruption in global oil exports caused by the Middle East conflict has finally...