HomeFILM NEWSటాలీవుడ్ కు ఈ రోజు చీకటి రోజు, ఒకే రోజు ఇద్దరి మృతి | నటి...

టాలీవుడ్ కు ఈ రోజు చీకటి రోజు, ఒకే రోజు ఇద్దరి మృతి | నటి జమున(86) కన్నుమూత

Published on

Latest articles

భారత్‌కు గుడ్ న్యూస్ : పుల్వామా దాడి సూత్రధారి ఔట్

పాకిస్తాన్‌లో గుర్తుతెలియని వ్యక్తుల వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. భారత గడ్డపై టెర్రరిస్టు దాడులకు ప్లాన్లు వేసి అమలు...

ఈ మ్యాచ్ కూడా ఆడకపోతే ధోనీ పేరు ఔట్

ఎంఎస్ ధోనీ.. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐపీఎల్ కింగ్‌గా నిలబెట్టిన ప్లేయర్. ఏకంగా 5 సార్లు సీఎస్కేకు కప్పు...

బీజేపీని వణికించిన కాక్రోచ్ జనతా పార్టీ.. కోటిన్నర ఫాలోవర్లున్న అకౌంట్ ఇప్పుడు బ్లాక్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్.. ఓ కేసులో భారతదేశపు యువతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఒక...

ఒకే రోజు ఇద్దరి మృతితో టాలీవుడ్ లో ఈ రోజు చీకటి రోజుగా మారింది. పాతతరం నటి జమున(86) అనారోగ్య కారణాలతో ఈ రోజు ఉదయం తన నివాసంలో తుదిశ్వాస విడవగా.. స్టార్ హీరోలకు డబ్బింగ్ చెప్పే ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కూడా ఇదే రోజున చెన్నై హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

జమున పార్థీవ దేహాన్ని ప్రస్తుతం ఫిల్మ్ చాంబర్ లో ఉంచారు. టాలీవుడ్ ప్రముఖులంతా ఆమెను కడసారి చూసేందుకు తరలి వస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు ఫిల్మ్ నగర్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సత్యభామ పాత్రకే వన్నె తెచ్చిన జమున ఆ తరం నటీమణుల్లో అగ్రతారగా వెలుగొందారు. ఆమె మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అని టాలీవుడ్ నటీనటులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి మరణ వార్తను ఆయన కుటంబీకులు ధృవీకరించారు. అయితే.. మిగతా విషయాలు ఇంకా వెల్లడించలేదు. తమిళ నటుడు సూర్యకు పర్మినెంట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి. అర్జున్ కెరీర్ లో మరిచిపోలేని ఒకే ఒక్కడు సినిమాతో శ్రీనివాస మూర్తి పేరు మార్మోగిపోయింది.

అపరిచితుడు సినిమాలో మూడు పాత్రలకు మూడు రకాలుగా వాయిస్ ఇచ్చి ఔరా అనిపించిన మూర్తి.. ఇటీవల మాధవన్ రాకెట్రీ సినిమాతో మరింత పేరు సంపాదించాడు. రవితేజ ధమాకా సినిమాలో జయరాం క్యారెక్టర్ కు డబ్బింగ్ చెప్పాడు. బహుశా విడుదలైన వాటిలో ఇదే చివరి సినిమా.

FOLLOW US

More like this

భారత్‌కు గుడ్ న్యూస్ : పుల్వామా దాడి సూత్రధారి ఔట్

పాకిస్తాన్‌లో గుర్తుతెలియని వ్యక్తుల వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. భారత గడ్డపై టెర్రరిస్టు దాడులకు ప్లాన్లు వేసి అమలు...

ఈ మ్యాచ్ కూడా ఆడకపోతే ధోనీ పేరు ఔట్

ఎంఎస్ ధోనీ.. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐపీఎల్ కింగ్‌గా నిలబెట్టిన ప్లేయర్. ఏకంగా 5 సార్లు సీఎస్కేకు కప్పు...

బీజేపీని వణికించిన కాక్రోచ్ జనతా పార్టీ.. కోటిన్నర ఫాలోవర్లున్న అకౌంట్ ఇప్పుడు బ్లాక్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్.. ఓ కేసులో భారతదేశపు యువతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఒక...