HomeINTERNATIONAL NEWSవణికిస్తున్న వెయ్యి ట్యాంకుల రేడియేషన్ వాటర్.. ఏం చేయబోతున్నారు

వణికిస్తున్న వెయ్యి ట్యాంకుల రేడియేషన్ వాటర్.. ఏం చేయబోతున్నారు

Published on

Latest articles

BJP Shock for Annamalai? Rajinikanth Enters the Picture

Former Tamil Nadu BJP president K. Annamalai, who left the BJP citing differences with...

I Will Not Allow Iran to Have Nuclear Bombs” – Netanyahu

It is well known that the United States and Iran have recently reached a...

If You Have the Courage, Go and Ask Modi” – KTR Counters Revanth Reddy

The war of words between the ruling Congress party and the BRS and BJP...

2011 మార్చి 11.. ఆ రోజు నిద్ర లేచిన జపనీయులకు మృత్యువే ఎదురుగా వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పింది. మొదట భూకంపం, ఆ తర్వాత దాని ప్రభావంతో సునామీ జపాన్‌పై విరుచుకుపడ్డాయి. ఈ ప్రకృతి విపత్తు కారణంగా దాదాపు 20 వేల మంది మృత్యువాత పడ్డారు. లక్షలాది మంది జపనీయులు నిరాశ్రయులుగా మారారు. కానీ, అదే భూకంపం, సునామీ ధాటికి మరో ఉపద్రవం ముంచుకురాబోతుందని ఆ సమయంలో జపాన్ ప్రజలు ఏమాత్రం ఊహించలేదు.

సునామీ సమయంలో జపనీయులు ఊహించని ఆ ఉపద్రవం ఇదే. భూకంపం దాటికి జపాన్‌లోని ఫుకుషిమా అణుకేంద్రంలోని మూడు రియాక్టర్లు పేలిపోయాయి. అసలే భూకంపం, సునామీల దాటికి చెల్లా చెదురైపోయిన జపాన్ ప్రజలకు ఇది మరో శాపంగా మారింది. ఉన్నపళంగా వేలాది మందిని ఫుకుషిమా నుంచి దూరంగా తరలించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పట్లో 1.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణమో అర్ధం చేసుకోవచ్చు. అదికూడా సునామీ విరుచుకుపడ్డ సమయంలో అంత మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం మాటలు కాదు. కానీ, జపాన్ ప్రభుత్వం ఆ పని చేయాల్సి వచ్చింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన తర్వాత పేలిపోయిన ఆ రియాక్టర్లను చల్లబర్చేందుకు వాడిన జలాలు రేడియోధార్మికతతో కలుషితమై, లీకయ్యాయి. ఆ నీటిని వెయ్యి ట్యాంకుల్లో నిల్వ ఉంచారు. ఇప్పుడు అవే నీళ్లు జపాన్‌కు ఆనాటి గాయాన్ని పదే పదే గుర్తు చేస్తున్నాయి. గుర్తు చేయడం మాత్రమే కాదు ప్రాణసంకటంగా మారాయి కూడా.

వెయ్యి ట్యాంకుల్లో ఉన్న రేడియోధార్మికత నీళ్లను ఎన్నేళ్లని అలానే ఉంచుతారు? ఎంతకాలమని అవి ఆ ట్యాంకుల్లో అలాగే ఉంటాయి? ఏదో ఒకరోజు ట్యాంకులు ధ్వంసం అయితే? ఇలా ఒక్కటేంటి జపాన్ ప్రభుత్వాన్ని కలలోనూ వెంటాడే ఇలాంటి ప్రశ్నలు చాలానే ఉన్నాయి. అందుకే, ఎలా అయినా ఆ టెర్రర్ వాటర్‌ను సముద్రంలో కలిపేసి వదిలించుకోవాలని కిషిద సర్కార్ ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టింది.

కానీ, రేడియోధార్మికత కలిసిన నీళ్లను సముద్రంలో కలుపుతామంటే పొరుగు దేశాలు ఊరుకుంటాయా.. జపాన్ విషయంలో కూడా అదే జరుగుతూ వస్తోంది. జపాన్ తన ప్రతిపాదనను తెరపైకి తెచ్చిన ప్రతిసారీ దాని పొరుగు దేశాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా చైనా, దక్షిణ కొరియా, ఫసిఫిక్‌లోని కొన్ని దీవులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో జపాన్ అనుకున్నది
జరగడం లేదు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే జపాన్‌కు ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్‌ ట్యాంకుల్లో ఉన్న జలాలను సముద్రంలో కలిపే సేందుకు ఓకే అంది. పొరుగు దేశాల అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని జపాన్ చర్యలు అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడే ఉన్నాయని, ఆ జలాల వల్ల పెద్దగా ప్రతికూల ప్రభావాలేవీ ఉండబోవని పేర్కొంది. ఇక్కడే జపాన్‌లో కొత్త ఆశలు చిగురించాయి. ఐఏఈఏ గైడ్‌లైన్స్ ప్రకారం ఆ నీటిని క్రమంగా సముద్రంలోకి విడుదల చేయొచ్చు. ఇందుకోసం సముద్రం కింద ఒక సొరంగాన్ని ఉపయోగించుకో వాల్సి ఉంటుంది.

అయితే అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ క్లారిటీ ఇచ్చినా కానీ.. జపాన్‌ ప్రణాళికలను చైనా, దక్షిణ కొరియా లాంటి పొరుగు దేశాలు అంగీకరించడం లేదు. జపాన్ చర్యలవల్ల ప్రజారోగ్యానికి, సముద్ర పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని ఆరోపిస్తున్నాయి. జపాన్‌ మత్స్యకారులు కూడా దీనిపై ఆందోళన చెందుతున్నారు. తాము సరఫరా చేసే చేపల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతాయని వారు చెబుతున్నారు.

జపాన్ విడుదల చేసే నీటిలో ఎక్కువగా సీజియం, ఇతర రేడియోధార్మిక పదార్థాలు ఉంటాయి. చాలావరకు వీటిని వడగట్టేస్తారు. ట్రిటియం ఐసోటోప్‌ను మాత్రం నీటి నుంచి వేరు చేయడం చాలా కష్టం. అందువల్ల సముద్రపు నీటితో దాన్ని వందరెట్లు పలుచగా చేసి, ఆ తర్వాతే పసిఫిక్‌ జలాల్లోకి వదులుతామని జపాన్‌ చెబుతోంది. ఫలితంగా ఆ వ్యర్థ జలాల్లో ట్రిటియం పరిమాణం.. అంతర్జాతీయంగా అమోదించిన స్థాయి కన్నా తక్కువగానే ఉంటుందని వివరించింది. కానీ, పొరుగు దేశాలు మత్సకార వర్గాలు అందుకు ససేమిరా అంటున్నాయి. సరిగ్గా రెండేళ్ల క్రితం కూడా ఇదే జరిగింది. అప్పుడు కూడా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ జపాన్‌కు మద్దతుగా నిలిచింది. కానీ, చైనా, సౌత్ కొరియా లాంటి దేశాలు అడ్డుకోవడంతో సాధ్యపడలేదు. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. మరి ఈ టెర్రర్ వాటర్‌ను జపాన్ ఎలా వదిలించుకుంటుందో చూడాలి.

FOLLOW US

More like this

BJP Shock for Annamalai? Rajinikanth Enters the Picture

Former Tamil Nadu BJP president K. Annamalai, who left the BJP citing differences with...

I Will Not Allow Iran to Have Nuclear Bombs” – Netanyahu

It is well known that the United States and Iran have recently reached a...

If You Have the Courage, Go and Ask Modi” – KTR Counters Revanth Reddy

The war of words between the ruling Congress party and the BRS and BJP...