Home NATIONAL NEWS మణిపూర్ అల్లర్ల కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

మణిపూర్ అల్లర్ల కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

0
మణిపూర్ అల్లర్ల కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

మేథీ, కూకీ తెగల మధ్య రగిలిన గొడవలు మణిపూర్ రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చిన విషయం తెలిసిందే. అల్లర్లు మొదలై 2 నెలలు దాటినా ఇప్పటికీ మణిపూర్ లో పరిస్థితులు అదుపులోకి రావటం లేదు. పరిస్థితి కాస్త సద్దుమణిగిందని భావించి కర్ఫ్యూ సడలించగానే మళ్ళీ జనాలు తుపాకులతో వీరంగం సృష్టిస్తున్నారు. దీంతో ఆర్మీ మణిపూర్ లో కర్ఫ్యూను సడలించటానికి కూడా జంకుతున్నది. అయితే.. మణిపూర్ లో అల్లర్లను అదుపు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అల్లర్లను అదుపుచేయటంలో కోర్టు జోక్యం చేసుకోవాలంటూ పబ్లిక్ ఇంట్రస్ట్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషనర్ల తరఫున అడ్వొకేట్ కొలిన్ గొంజాల్వెస్ సుప్రీంలో వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

మణిపూర్ అల్లర్ల విషయంలో ప్రభుత్వం తీసుకునే చర్యలను పర్యవేక్షించటం మాత్రమే సుప్రీంకోర్టు చేయగలదనీ.. ఇందులో కలగజేసుకొని శాంతి భద్రతలను నడపటం సుప్రీంకోర్టు పని కాదనీ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలను కాపాడటం ప్రభుత్వం యొక్క ప్రథమ విధి అనీ.. కోర్టులు కలగజేసుకొని చర్య తీసుకోలేవనీ చెప్పారు. కావాలంటే ప్రభుత్వానికి కావాల్సిన సూచనలతో కూడిన ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు.

దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ప్రభుత్వం తరఫున వాదిస్తూ.. కోర్టు ముందు ప్రభుత్వం నివేదిక ఉంచిందనీ.. ప్రభుత్వం సమర్పించిన నివేదిక పూర్తిగా అధ్యయనం చేయాలనీ కోరారు. కోర్టుకు ఎప్పుడూ తప్పుడు సమాచారం అందజేయకూడదని వ్యాఖ్యానించిన తుషార్ మెహతా.. చిన్న తప్పుడు చర్య కూడా పరిస్థితి మరింత దారుణంగా మారటానికి కారణం కావచ్చని చెప్పారు. దీనిపై సుప్రీంకోర్టు మరో వ్యాఖ్య కూడా చేసింది. స్వార్థ ప్రయోజనాల కోసం హింసను వాడుకోకూడదనీ.. కోర్టులను ఇలాంటి విషయాల్లో కలగజేసుకోవాలని ఎవ్వరూ కోరకూడదనీ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. మణిపూర్ లో పరిస్థితిని మేం గమనిస్తున్నాం..

కానీ శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వాన్ని కాదని కలగజేసుకోవటం తప్పుడు సంకేతాలను ఇస్తుంది.. ఇలాంటి పిటిషన్లు వేసి తప్పుదోవ పట్టించటం సరికాదు.. అంటూ మొట్టికాయలు వేశారు జస్టిస్ చంద్రచూడ్. ప్రస్తుతం మణిపూర్ లో హింస అదుపులోనే ఉన్నప్పటికీ.. కర్ఫ్యూ ఎత్తివేసే పరిస్థితులు మాత్రం లేవు. రెండు రోజుల క్రితం ప్రజలు నిత్యావసరాలు కొనుక్కునేందుకు కర్ఫ్యూను సడలించిన కొద్ది సేపట్లోనే ఓ మహిళ కాల్చి చంపబడింది. ప్రజల్లో ఆవేశం చల్లారేంత వరకూ మణిపూర్ లో కర్ఫ్యూ సడలించే అవకాశాలు కనిపించటం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here