HomeNATIONAL NEWSకశ్మీర్ పై భారత్ యాక్షన్ తీసుకోబోతున్నదా ?

కశ్మీర్ పై భారత్ యాక్షన్ తీసుకోబోతున్నదా ?

Published on

Latest articles

New Twists Await in the OTT Version of Sing Geetham

Veteran filmmaker Singeetam Srinivasa Rao, known for creating some of the most innovative films...

Do You Want a Puppy? I’ll Send One”: Pawan Kalyan Fulfills a Young Fan’s Wish

Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan met a 17-year-old fan from Warangal who...

Good News: Oil Supply Resumes; Petrol Prices May Fall

The disruption in global oil exports caused by the Middle East conflict has finally...

ప్రపంచంలో ఎప్పటికీ పరిష్కారం కాని సమస్యలు అంటూ ఓ పదేళ్ళ క్రితం యూరప్ మీడియా కొన్ని సమస్యలతో ఓ లిస్టు అనౌన్స్ చేసింది. వాటిలో ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్య మొదటిది కాగా.. భారత్ పాకిస్తాన్ మధ్య గల కశ్మీర్ సమస్య రెండోది.. అలాగే బాబ్రీ మసీదు సమస్య మూడోది. భారత్ లో కుంభకోణాల సమస్య 9వ సమస్యగా యూరప్ మీడియా మొత్తం 20 సమస్యల లిస్ట్ ఇచ్చింది. ఈ పదేళ్ళలో ఆ లిస్టులో ఉన్న సమస్యల్లో భారత్ లోని రెండు సమస్యలు పరిష్కారమైపోయాయి. ఒకటి.. విదేశాలతో కుంభకోణాలు.. రెండోది బాబ్రీ మసీదు. ఇలా జరుగుతుందని యూరప్ మీడియానే కాదు.. భారత్ కూడా ఊహించలేదు. కానీ.. ఈ పదేళ్ళలో టాప్ టెన్ లోని రెండు సమస్యలు భారత్ పరిష్కరించుకుంది. ఇక ఇప్పుడు మూడో సమస్యను కూడా పరిష్కరించాల్సిన టైమ్ వచ్చేసిందనిపిస్తోంది. అదే.. భారత్ పాకిస్తాన్ మధ్య గల కశ్మీర్ సమస్య.

అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేయటంతో యావత్ భారతదేశం అల్లకల్లోలంగా మారింది. అక్కడ రామమందిరం ఉండేదంటూ మొదలైన వివాదం సుప్రీంకోర్టులో దశాబ్ధాల తరబడి నలిగింది.. చివరికి మోడీ సర్కార్ యూపీ సర్కార్ కలిసి ఈ వివాదానికి పరిష్కారం చూపించాయి. ఇప్పుడు అక్కడ హిందువులు, ముస్లింలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరి దేవుడికి వాళ్ళు గుడి కట్టే పనిలో బిజీగా ఉన్నారు. రామమందిర నిర్మాణానికి ముస్లింలు స్థలాన్ని విరాళంగా ఇవ్వటంతో పాటు లక్షల సొమ్ము చందాగా అందజేస్తున్నారు. మసీదు నిర్మాణానికి హిందూ సంఘాల నేతలు విరాళాలు ఇస్తున్నారు. ఇలా జరుగుతుందని ఎవ్వరూ ఊహించలేదు.. ముఖ్యంగా భారత్ అల్లకల్లోలంగా ఉండాలని కోరుకునే కొన్ని దేశాలు అస్సలు ఊహించలేదు.. కానీ జరిగింది.

అలాగే భారతదేశంపై ఉన్న అవినీతి కుంభకోణాల మచ్చ చెరిగిపోయింది.. అందుకు కారణం ఎవరు.. ఎలా చేశారు అనేది ఇప్పుడు అప్రస్తుతం.. ఎందుకంటే దీనిపై లోతుగా చర్చిస్తే అది వ్యక్తి పూజలా కనిపిస్తుంది.. సో.. టైమ్ ఫర్ పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్.
పాకిస్తాన్ ప్రస్తుతం ఆకలితో అలమటిస్తోంది.. రోజుకు ఒక్క పూట భోజనం కోసం తుపాకులతో కాల్చి చంపుకుంటున్నారు కశ్మీర్ ప్రజలు. పాకిస్తాన్ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న గోధుమ పిండి బస్తా కోసం వెళ్ళిన మనిషి బస్తాతో ఇంటికి వస్తాడో.. బుల్లెట్లకు బలైపోతాడో తెలియని పరిస్థితి. ఇక పాకిస్తాన్ సైన్యం పరిస్థితి మరీ దారుణం. కనీసం మూడు పూటలా భోజనం గతిలేదు పాక్ సైన్యానికి. యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలు పార్కింగ్ లో పెట్టేసింది పాక్ సైన్యం. ఒకప్పుడు సరిహద్దుల్లో ఉన్న సైనికులు ట్రక్ లలో క్యాంపులకు వచ్చి భోజనాలు చేసి మళ్ళీ సరిహద్దులకు వెళ్ళే వారు అవే ట్రక్ లలో.

ఇప్పుడు బోర్డర్ నుంచి 2 కిలోమీటర్లు నడిచి క్యాంపుకు వచ్చి భోజనం చేసి వెళ్ళాలని సైనికులకు ఆదేశాలిచ్చింది పాక్ సైన్యం… డీజిల్ మిగులుతుందని. రోజుకు రెండే సార్లు సైనికులకు భోజనం లభిస్తోంది.. అది కూడా మూడు రొట్టెలు మాత్రమే. డాలర్లు చెల్లింది పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసే పరిస్థితి లేదు కాబట్టి.. యుద్ధ ట్యాంకులు, విమానాలే కాదు.. రోజువారీ డ్రిల్స్ కోసం వాడే ట్రక్కులు కూడా పక్కన పెట్టేసింది. ఇలాంటి పరిస్థితుల్లో సైన్యం యుద్ధం చేయగలదా.. ఖచ్చితంగా లేదనే చెప్పాలి.
పాకిస్తాన్ వ్యాపారులు విదేశాల నుంచి చాలా వస్తువులను ఆర్డర్ చేశారు.. అవి ఇప్పుడు కరాచీ పోర్టుకు చేరి డెలివరీకి సిద్ధంగా ఉన్నాయి.. కానీ వాటికి పేమెంట్లు చేయాల్సింది డాలర్ల రూపంలో. డాలర్ రిజర్వ్ లేని పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంకు ఇప్పుడు లక్షలాది డాలర్లను చెల్లించి కంటైనర్లలో ఉన్న సరుకు డెలివరీ తీసుకునేందుకు జంకుతోంది. ఆర్డర్లు పంపిన కంపెనీలు లబో దిబో మంటున్నాయి. కంటైనర్లు అక్కడే ఉన్నందుకు రోజుకు వెయ్యి డాలర్ల ఫైన్ చెల్లించాలి పాకిస్తాన్ ప్రభుత్వం.

అటు డెలీవరీ చార్జ్ చెల్లించాలా.. కంటైనర్లు నిలిపినందుకు పార్కింగ్ ఫీజు చెల్లించాలా.. ఈ నిర్ణయం తీసుకునేందుకు ఆలస్యం చేస్తే ఫైన్ చెల్లించాలా.. దిక్కుతోచకుండా ఉంది పాక్ పరిస్థితి. ఇలాంటి స్థితిలో భారత్ కనుక పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తే.. పాకిస్తాన్ సైన్యానికి లొంగిపోవటం తప్ప మరో ఆప్షన్ లేదు. తుప్పు పట్టిన తుపాకులు.. పార్కింగ్ లో పెట్టిన యుద్ధ ట్యాంకులు.. డీజిల్ లేక షెడ్లో పెట్టేసిన యుద్ధ విమానాలు.. దేనితో ఎదుర్కుంటారు పాక్ సైనికులు భారత సైన్యాన్ని. పాక్ ఆర్మీ క్యాంపులను కేవలం నిముషాల వ్యవధిలో మిసైల్ అటాక్స్ తో బూడిద చేయగలవు భారత్ ఇటీవల కొనుగోలు చేసిన యుద్ధ విమానాలు. పాక్ ఒక వేళ అణుదాడికి సిద్ధపడితే.. ఆ దాడి జరిగేలోగానే భారత్ అణుదాడి చేసి మొత్తం పాకిస్తాన్ ను బూడిద చేయగలదు. సో.. భారత్ కనుక పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తే.. పాకిస్తాన్ నిరభ్యంతరంగా ఇచ్చేయాలే తప్ప.. కశ్మీర్ కోసం యుద్ధం చేసి సైన్యాన్ని.. అణుదాడి చేసి మొత్తం దేశాన్నీ నాశనం చేసుకోలేదు. ఒక వేళ చైనా మనకు ఎదురు వస్తే.. అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ వంటి దేశాలు భారత్ వెంట ఉంటాయి. అది చైనాకే తీరని నష్టాన్ని మిగులుస్తుంది. మొత్తానికి పాకిస్తాన్ ఇప్పుడు అష్టదిగ్బంధనంలో ఉందన్న విషయం ప్రపంచానికి తెలుసు.. ఇంత అనువైన సమయంలో భారత్ ఆ మూడో సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తుందా.. ప్రపంచాన్ని వేధిస్తున్న అతి పెద్ద ప్రశ్న ఇది. బాలాకోట్ లో టెర్రరిస్టు క్యాంపుపై దాడి చేస్తాం.. పర్మిషన్ ఇవ్వండి అని ఇండియన్ ఆర్మీ అడిగితే.. కేవలం పావుగంట ఆలోచించి ఓకే చెప్పారు ప్రధాని మోడీ. మరి ఇప్పుడు మన సైనికులు మేం రెడీ అన్నారంటే.. ఇక పని అయిపోయినట్టే.

FOLLOW US

More like this

New Twists Await in the OTT Version of Sing Geetham

Veteran filmmaker Singeetam Srinivasa Rao, known for creating some of the most innovative films...

Do You Want a Puppy? I’ll Send One”: Pawan Kalyan Fulfills a Young Fan’s Wish

Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan met a 17-year-old fan from Warangal who...

Good News: Oil Supply Resumes; Petrol Prices May Fall

The disruption in global oil exports caused by the Middle East conflict has finally...