Home NATIONAL NEWS మోదీ పర్యటనపై “సూసైడ్ బాంబ్” : కేరళలో బెదిరింపు లేఖ కలకలం

మోదీ పర్యటనపై “సూసైడ్ బాంబ్” : కేరళలో బెదిరింపు లేఖ కలకలం

0
మోదీ పర్యటనపై “సూసైడ్ బాంబ్” : కేరళలో బెదిరింపు లేఖ కలకలం

ప్రధానమంత్రి మోదీ పర్యటనపై ఆత్మాహుతి దాడి చేస్తామంటూ బీజేపీ కార్యాలయానికి వచ్చిన బెదిరింపు లేఖతో కేరళ రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. వారం రోజుల క్రితమే రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి ఈ లేఖ వచ్చినప్పటికీ బీజేపీ నేతలు దీన్ని దాచి ఉంచారు. కాకపోతే.. లేఖ అందగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే.సురేంద్రన్ ఈ లేఖతో పాటు మిగతా వివరాలను ఇంటలిజెన్స్ విభాగం డైరెక్టర్ జనరల్ కు అందజేశారు. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన సెక్యూరిటీ ప్రోటోకాల్ అంశాలు మీడియాకు లీక్ కావటంతో అందులోని ఈ లేఖ విషయం కూడా బయటకు వచ్చింది. రసహ్యంగా ఉంచాల్సిన లేఖ విషయం లీక్ కావటంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి మురళీధరన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ కేరళ పోలీసు శాఖను ఆదేశించారు.
ఏప్రిల్ 24న ప్రధాని మోదీ కేరళలో పర్యటించనున్నారు. కొచ్చిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించటంతో పాటు తిరువనంతపురంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను మోదీ ప్రారంభించనున్నారు. బెదిరింపు లేఖ నేపథ్యంలో మోదీ కేరళ పర్యటన రద్దు అవుతుందంటూ వార్తలు రాగా.. దీనిపై కేరళ బీజేపీ స్పందించింది. మోదీ పర్యటన యధావిధిగా ఉంటుందంటూ స్పష్టం చేసింది. కశ్మీర్ లో జీ20 సదస్సు నిర్వహణపై పాకిస్తాన్ నుంచి హెచ్చరికలు రావటం.. అతీక్ అహ్మద్ హత్య తర్వాత తీవ్రవాద సంస్థల నుంచి హెచ్చరికలు రావటం.. ఇప్పుడు కేరళలో ఆత్మాహుతి దాడి చేస్తామంటూ హెచ్చరికలు రావటం.. అన్నింటి వెనుక ఉన్నది ఒక్క కుట్ర కోణమే అనేది ఇంటలిజెన్స్ అనుమానం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లో పరిస్థితులు అద్బుతంగా ఉన్నాయని నిరూపించేందుకే బీజేపీ ప్రభుత్వం కశ్మీర్ లో జీ-20 సదస్సు నిర్వహించేందుకు సిద్ధపడింది. కానీ.. కశ్మీర్ లో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయన్న విషయం బయట ప్రపంచానికి తెలియటం ఇష్టంలేని పాకిస్తాన్, చైనా దేశాలు ఇలా తీవ్రవాద సంస్థలతో బెదిరింపులకు పాల్పడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో బీజేపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆసక్తికరమైన విషయంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here