HomeNATIONAL NEWSగోద్రా అల్లర్ల కేసు : తీస్తా సెతల్వాద్ లొంగిపోవాలంటూ కోర్టు తీర్పు

గోద్రా అల్లర్ల కేసు : తీస్తా సెతల్వాద్ లొంగిపోవాలంటూ కోర్టు తీర్పు

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

దేశవ్యాప్తంగా సంచలనం సష్టించిన గుజరాత్ గోద్రా అల్లర్ల కేసులో శనివారం ఉదయం గుజరాత్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 2002లో జరిగిన ఈ అల్లర్ల పై ఇప్పటికీ పలు కేసులు విచారణలో ఉన్నాయి. ఈ అల్లర్లకు అసలు ఏమాత్రం సంబంధం లేని వారికి వ్యతిరేకంగా దొంగ సాక్ష్యాలు పుట్టించింది అంటూ సామాజిక కార్యకర్త అయిన తీస్తా సెతల్వాద్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా ఈ అల్లర్ల వెనుక ఉన్నారంటూ ఈమె సాక్ష్యాలు కోర్టుకు చూపించింది. అయితే.. ఈ సాక్ష్యాలు పుట్టించిన సాక్ష్యాలంటూ ఈమెపై కేసు నమోదు చేశారు సీబీఐ అధికారులు. ఇదే కేసులో అరెస్ట్ అయిన తీస్తా సెతల్వాద్ ఆ తర్వాత బెయిల్ పై విడుదలైంది. ప్రస్తుతం కూడా బెయిల్ పైనే ఉంది. అయితే.. తన బెయిల్ ను పొడగించాలంటూ ఈమె తరఫు లాయర్ వేసిన పిటిషన్ ను విచారించిన గుజరాత్ కోర్టు.. బెయిల్ ఇవ్వటం కుదరదనీ.. వెంటనే కోర్టు ఎదుట లొంగిపోవాలంటూ కీలక తీర్పునిచ్చింది. పిటిషన్ ను విచారించిన న్యాయమూర్తి నిజార్ దేశాయి.. తీస్తా బయట ఉంటే సాక్ష్యాలను మళ్ళీ తారుమారు చేయవచ్చన్న వాదనలో అంగీకరించారు. వెంటనే ఆమెను కోర్టు ఎదుట లొంగిపోవాలని.. ప్రస్తుతం ఉన్న బెయిల్ ను కూడా ఈ రోజుతో రద్దు చేస్తున్నామనీ తీర్పునిచ్చారు.

గత సంవత్సరం జూన్ 25న తీస్తా సెతల్వాద్ తో పాటు డీజీపీగా పనిచేసిన ఆర్బీ శ్రీకుమార్ లను కూడా గుజరాత్ పోలీసులు అరెస్టు చేసి జైళ్ళో వేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళిన సెతల్వాద్ 2022 సెప్టెంబర్ లో విడుదలై బెయిల్ పై ఉన్నది. గోద్రాలో అల్లర్లు జరిగిన సమయంలో ప్రస్తుత ప్రధాని మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే.. గోద్రా అల్లర్ల వెనుక అదృశ్య హస్తం గుజరాత్ ముఖ్యమంత్రి మోడీయేననీ అప్పటి డీజీపీ శ్రీకుమార్ తో కలిసి తీస్తా సెతల్వాద్ సాక్ష్యాలు పుట్టించింది. ముఖ్యమంత్రిపై వస్తున్న ఆరోపణలను నిజానిజాలు తేల్చాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో అప్పటి సీబీఐ అధికారులు ఈ కేసును విచారించి.. తనకు ఉన్న అధికారాలతో డీజీపీ శ్రీకుమార్ మరియు తీస్తా సెతల్వాద్ దొంగ సాక్ష్యాలను పుట్టించారని తేల్చారు. దీంతో వీరిద్దరినీ గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత చాలా రోజుల పాటు సాగిన సీబీఐ విచారణలో.. మోడీతో పాటు తీస్తా సెతల్వాద్ పేర్కొన్న ఎవ్వరికీ గోద్రా అల్లర్లతో ప్రమేయం లేదని తేల్చి క్లీన్ చిట్ ఇచ్చారు.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...