గుండెపోటుతో నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్యం గురించి డాక్టర్లు తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. గుండె పని తీరు కాస్తంత మెరుగు పడిందని రిపోర్టులో పేర్కొన్న వైద్యులు.. సపోర్ట్ సిస్టమ్ రేంజ్ ను కాస్త తగ్గించి చూశామనీ.. అయినప్పటికీ గుండె పనితీరు బాగానే ఉందని చెప్పారు. అయితే.. ఇప్పటికీ తారకరత్న వెంటిలేటర్ పైనా ఉన్నాడు. గుండె బ్లడ్ పంపింగ్ సరిగ్గా చేయకపోవటంతో రక్తం సరఫరా కాని సమయంలో మెదడుకు సంబంధించిన సమస్య వచ్చిందని.. బ్రెయిన్ డ్యామేజ్ అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు. రక్తం సరఫరాలో అంతరాయం వల్ల కిడ్నీల సమస్య కూడా తెలత్తిందని డాక్టర్లు ఇదివరకే చెప్పారు.
ప్రస్తుతానికి గుండె, కాలేయంతో పాటు మెదడు పని తీరు కాస్త మెరుగయ్యిందని డాక్టర్లు చెప్పారు. కర్ణాటకలోనే అత్యుత్తమ వైద్యుల బృందం తారకరత్నకు చికిత్స అందజేస్తున్నారని నందమూరి రామకృష్ణ మీడియాకు చెప్పారు. ఇంకా ఎన్ని రోజులు వెంటిలేటర్ పై ఉంచుతారనే విషయం తెలియదనీ.. కాకపోతే.. మెల్లమెల్లగా లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ను తొలగించే ప్రయత్నం చేస్తామని డాక్టర్లు చెప్పారని రామకృష్ణ తెలిపారు. చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, ఎన్టీఆర్ తో పాటు మిగితా కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారు.