తెలంగాణ చీఫ్ సెక్రెటరీ పదవి నుంచి రిలీవ్ చేసుకొని ఏపీ వెళ్ళిపోవాలన్న హైకోర్టు ఆదేశాలతో తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఏపీకి వెళ్ళటం ఇష్టం లేని సోమేష్ కుమార్.. కోర్టు ఆదేశాలు వెలువడిన వెంటనే సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఆ భేటీలోనే సోమేష్ కుమార్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ముందస్తు రిటైర్మెంట్ తీసుకొని తెలంగాణలోనే ఉండిపోవాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మరో విశేషం ఏమిటంటే.. రిటైర్మెంట్ తర్వాత సోమేష్ కుమార్ కు కేసీఆర్ చీఫ్ అడ్వైజర్ పదవి ఇవ్వనున్నారని సమాచారం.
సీఎం కేసీఆర్ మొదటి నుంచి సోమేష్ కుమార్ కు చాలా ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. కానీ కోర్టు ఉత్తర్వులు కేసీఆర్ మరియు సోమేష్ కుమార్ అభీష్టానికి వ్యతిరేకంగా వచ్చాయి. 2014లో ఆంధ్రప్రదేష్ విభజన జరిగి ఏపీ తెలంగాణ వేర్వేరు రాష్ట్రాలుగా అవతరించిన తర్వాత ఐఏఎస్ అధికారుల పంపకంలో సోమేష్ కుమార్ ఏపీకి కేటాయించబడ్డారు. కానీ క్యాట్ ఉత్తర్వుల మేరకు ఆయన తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్నారు. దీనిపై తెలంగాణ హైకోర్టులో అప్పీల్ చేయగా.. ఆయనను ఏపీకి వెళ్ళిపోవాలంటూ హైకోర్టు ఆదేశించింది.