Home INTERNATIONAL NEWS మోడీకి ఊహించని షాక్.. ర్యాలీకి నో పర్మిషన్

మోడీకి ఊహించని షాక్.. ర్యాలీకి నో పర్మిషన్

0
మోడీకి ఊహించని షాక్.. ర్యాలీకి నో పర్మిషన్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మేఘాలయ ప్రభుత్వం ఊహించని షాకిచ్చింది. ఈ నెల 24న షిల్లాంగ్, తురా ప్రాంతాల్లో ప్రధాని మోడీ నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి నేషనల్ పీపుల్స్ పార్టీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. బీజేపీ ఎన్నికల ప్రచారానికి భారీ ఎదురుదెబ్బ తగిలినట్టైంది. మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా సొంత నియోజకవర్గం తురాలోని పీఏ సంగ్మా స్టేడియంలో బీజేపీ అగ్రనాయకులతో భారీ ఎన్నికల ప్రచార సభ జరగాల్సి ఉంది. ఇందుకోసం అనుమతి కోరుతూ బీజేపీ దరఖాస్తు చేసుకుంది. కానీ ఈ సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. సభ నిర్వహించటానికి స్టేడియంలో సరైన వసతులు లేవనీ.. స్టేడియం నిర్మాణం ఇంకా పూర్తి కాలేదనీ సమాధానం చెప్తోంది ప్రభుత్వం. అయితే.. ఈ స్టేడియంను మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా పోయిన సంవత్సరమే ప్రారంభించారు. గతేడాడి డిసెంబర్ 16న స్వయంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమైంది పీఏ సంగ్మా స్టేడియం.
దీనిపై బీజేపీ అధిష్టానం మండిపడింది. 2 నెలల క్రితమే ప్రారంభమైన స్టేడియంలో ఇంకా పనులు పూర్తి కాలేదంటూ సాకులు చెప్పటంపై బీజేపీ విమర్శలు చేస్తోంది. మేఘాలయలో మోడీ సభకు సీఎం కాన్రాడ్ సంగ్మా భయపడిపోతున్నారంటూ బీజేపీ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. మోడీకి పెరుగుతున్న ప్రజాదరణ చూసి భయంతోనే కాన్రాడ్ ప్రభుత్వం తమ సభకు అనుమతి నిరాకరించిందని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఫిబ్రవరి 27న మేఘాలయలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here