Home AP NEWS ఫోన్ ట్యాపింగ్ కలకలం : రంగంలోకి దిగిన సీఎం జగన్

ఫోన్ ట్యాపింగ్ కలకలం : రంగంలోకి దిగిన సీఎం జగన్

0
ఫోన్ ట్యాపింగ్ కలకలం : రంగంలోకి దిగిన సీఎం జగన్

తన ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఒక్క సారిగా ఏపీ రాజకీయాలను వేడెక్కించాడు నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. సొంత పార్టీ ప్రభుత్వంతో పాటు తన సహచర నేతలపై తీవ్రమైన ఆరోపణలు చేశాడు కోటంరెడ్డి. నా ఫోన్ దొంగ చాటుగా వినాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తూనే.. తన వద్ద 12 ఫోన్లు ఉన్నాయనీ.. కావాలంటే అవి కూడా ట్యాప్ చేయండి అంటూ జగన్ సర్కార్ కు సవాల్ విసిరాడు. తన స్నేహితులే తన ఫోన్ ను ట్యాప్ చేయిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశాడు. దీంతో నెల్లూరు రాజకీయం తాడేపల్లి దాకా చేరింది. కోటంరెడ్డి వ్యవహారం ఏంటో తేల్చేందుకు సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయ్యాడు.
ప్రశాంతంగా ఉన్న నెల్లూరు రాజకీయాల్లో అలజడికి కారణాలు ఏంటో తెలుసుకునే పనిలో ఉన్నాడు జగన్. ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ ఆంజనేయులును ఉన్నఫలంగా క్యాంప్ ఆఫీస్ కు రమ్మని.. ఆయనతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నట్టు సమాచారం. ఇక సజ్జల మాత్రం కోటంరెడ్డి వ్యవహారంపై ఘాటుగా స్పందించాడు. ఆయన నిన్నటిదాకా వైసీపీ ఎమ్మెల్యే అనీ.. ఇప్పుడు కాకపోయి ఉండవచ్చని పరోక్షంగా చురకలంటించాడు. తెలుగుదేశం పార్టీతో అన్నీ మాట్లాడుకున్నాకే కోటంరెడ్డి ఈ ఆరోపణలు చేస్తున్నాడంటూ సజ్జల ఎద్దేవా చేశాడు. కోటంరెడ్డి వైపీసీకి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. వివాదం నేపథ్యంలో ప్రస్తుతం కోటంరెడ్డికి ఉన్న నెల్లూరు రూరల్ ఇంచార్జి పదవిని కూడా జగన్ తొలగించనున్నట్టు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here