Home INTERNATIONAL NEWS Budget 2023-24 : 7 లక్షల వరకు నో ఇన్ కమ్ ట్యాక్స్

Budget 2023-24 : 7 లక్షల వరకు నో ఇన్ కమ్ ట్యాక్స్

0
Budget 2023-24 : 7 లక్షల వరకు నో ఇన్ కమ్ ట్యాక్స్

బడ్జెట్ 2023-24లో కేంద్ర ప్రభుత్వం సామాన్యుడిపై జాలి చూపించింది. సంవత్సరానికి 7 లక్షల వేతనం కంటే ఎక్కువ ఉన్న వారు మాత్రమే ఇకపై ఆదాయపన్ను చెల్లించాల్సి ఉంది. 7 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వాళ్ళకు ఆదాయపన్ను నుంచి మినహాయింపు లభించింది. ఇది సగటు వేతన జీవికి భారీ ఉరట అని చెప్పాలి. పెట్రోల్, డీజిల్, గ్యాస్.. ఇలా విపరీతమైన ధరల పెరుగుదలతో ఇంతకు ముందు కంటే రెట్టింపు పన్నులు చెల్లిస్తున్న మధ్య తరగతి మనుషులు.. సంపాదించే కాస్త సంపాదనపై కూడా ఆదాయపు పన్ను చెల్లించాల్సి రావటం భారత పన్నుల వ్యవస్థలో ఉన్న అతి పెద్ద తప్పు. ఇప్పుడు ఈ ప్రభుత్వం దాన్ని సవరించింది. కనీసం ఈసారైనా ఆదాయపు పన్ను స్లాబ్ ను భారీగా పెంచి ఊరటనిచ్చింది.
అలాగే కొత్త బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం భారీ నిర్ణయాలే తీసుకుందని చెప్పాలి. అంతర్జాతీయంగా భారత్ పలుకుబడి పెరిగిన వేళ.. భారతదేశాన్ని సందర్శించాలనుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ఇండియా టూరిజం కోసం కొత్త ప్రణాళికలు తీసుకురావాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి రావటం గొప్ప విషయమే. “దేఖో అప్నా దేశ్” పేరిట కేంద్రం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇక ప్రపంచాన్ని మాంద్యం కమ్ముకొస్తున్న వేళ కొత్త సంస్కరణలు భారత బ్యాంకింగ్ కు బలం చేకూరుస్తాయి. దేశంలో ఏ లావాదేవీ జరిగినా చివరకు అది బ్యాంకుకు ముడిపడే ఉంటుంది కాబట్టి.. దీని వల్ల మిగతా రంగాలలో మార్పులు జరుగుతాయి. వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెరిగాయి. మహిళల కోసం ప్రత్యేక కేటాయింపులు జరిగాయి. ప్రపంచం ఎలక్ట్రిక్ వాహనాల వెంట పడుతున్న వేళ.. లిథియం అయాన్ బ్యాటరీపై పన్నుల తగ్గింపు ఆ రంగానికి ఊరటనిస్తుంది. ఏదిఏమైనా ఈ బడ్జెట్ లో సామాన్యుడికి మేలు చేసే నిర్ణయాలు మాత్రం తీసుకున్నారని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here