Home AP NEWS లోకేష్ కు షాకిచ్చిన పోలీసులు : ప్రచార రథం సీజ్

లోకేష్ కు షాకిచ్చిన పోలీసులు : ప్రచార రథం సీజ్

0
లోకేష్ కు షాకిచ్చిన పోలీసులు : ప్రచార రథం సీజ్

యువగళం పాదయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు లోకల్ పోలీసులు షాకిచ్చారు. పలమనేరు లో పర్యటిస్తున్న సమయంలో ఎంట్రీ ఇచ్చిన పోలీసులు లోకేష్ ప్రచార రథాన్ని సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. లోకేష్ ప్రసంగిస్తున్న సమయంలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆయన ప్రసంగం ముగిసిన తర్వాత ప్రచార రథాన్ని ఆధీనంలోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పాదయాత్రలో మైక్ వాడటానికి అనుమతి లేదని.. అందుకే ప్రచార రథాన్ని సీజ్ చేశామని పోలీసులు చెప్పారు.
పోలీసుల ప్రవర్తనతో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ఆగ్రహానికి లోనయ్యారు. అక్కడే కూర్చొని నిరసన వ్యక్తం చేసారు. జీఓ నెంబర్ 1 రాజ్యాంగానికి వ్యతిరేకమనీ.. తమ యాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టించటం మానుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు. కార్యకర్తల ఆందోళన ఉగ్రరూపం దాల్చక ముందే పోలీసులు లోకేష్ ప్రచార రథాన్ని విడిచిపెట్టారు. దీంతో లోకేష్ మళ్ళీ యాత్రను ప్రారంభించారు. కానీ మైక్ ఉపయోగించటానికి వీల్లేదని పోలీసులు స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here