Home INTERNATIONAL NEWS టర్కీ, సిరియాలో భారీ భూకంపం.. వందలాది మంది మృతి

టర్కీ, సిరియాలో భారీ భూకంపం.. వందలాది మంది మృతి

0
టర్కీ, సిరియాలో భారీ భూకంపం.. వందలాది మంది మృతి

భారీ భూకంపం టర్కీ, సిరియా దేశాలను కుదిపేసింది. ఈ భూకంపం ధాటికి ఇరుదేశాల్లో కలిపి మొత్తం సుమారు 7 వందల మంది ప్రాణాలు కోల్పోగా వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి. వందల సంఖ్యలో జనం గాయాలపాలయ్యారు. ఇరుదేశాల సరిహద్దు ప్రాంతంలోని గాజియాన్ తెప్ ప్రాంతానికి 33 కిలోమీటర్ల దూరంలో.. 18 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ప్రకటించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైంది. భూకంపం సంభవించిన తర్వాత సుమారు 20 సార్లు భారీ ప్రకంపనలు ఏర్పడటంతో భవనాలు కూలి ఎక్కువ నష్టం వాటిల్లినట్టు అధికారులు వెల్లడించారు. వందలాది మంది ఇంకా శిథిలాల కిందే ఇరుక్కున్నారు. రంగంలోకి దిగిన ఆయా దేశాల ఆర్మీ.. సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
టర్కీ చరిత్రలో 1939లో సంభవించిన భారీ భూకంపం తర్వాత ఇదే మళ్ళీ అంత తీవ్రమైనదిగా రికార్డైంది. 1939లో సంభవించిన భూకంపంలో ఎర్జికాన్ పట్టణంలో దాదాపు 33 వేల మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం భూకంపం సంభవించిన ప్రాంతంలో టర్కీ ఆర్మీకి చెందిన ఎయిర్ కారిడార్ ఉంది. భూకంపం విషయం తెలిసిన వెంటనే భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. భారత్ నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామని వెల్లడించారు. భారత్ నుంచి మెడికల్ బృందాలు, డాక్టర్లతో పాటు మందులను కూడా వెంటనే ప్రత్యేక విమానంలో టర్కీ పంపించారు. 100 మందితో కూడిన రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా టర్కీ బయల్దేరాయి. అత్యవసర సమయంలో సేవలందించే ఈ బృందంతో పాటు ఎమర్జెన్సీలో కూడా అనేక అత్యాధునిక పరికరాలను భారత ప్రభుత్వం పంపించింది. గాయపడిన వారికి అవసరమయ్యే మందులను త్వరలోనే ఏర్పాటు చేసి టర్కీకి పంపిస్తామని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here