Home INTERNATIONAL NEWS బీజేపీ కీలక నిర్ణయం వచ్చే ఎన్నికల దాకా నడ్డానే అధ్యక్షుడు

బీజేపీ కీలక నిర్ణయం వచ్చే ఎన్నికల దాకా నడ్డానే అధ్యక్షుడు

0
బీజేపీ కీలక నిర్ణయం వచ్చే ఎన్నికల దాకా నడ్డానే అధ్యక్షుడు

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కనీసం సంవత్సరం సమయం కూడా లేని సమయంలో.. భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డానే కొనసాగనున్నట్టు అమిత్ షా ప్రకటించారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో దేశవ్యాప్తంగా పార్టీకి సంబంధించిన కీలక విషయాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. నడ్డా పార్టీ కోసం ఎంతో చేశారనీ.. దేశవ్యాప్తంగా ఒక లక్ష 30 వేల బూత్ కమిటీలు ఏర్పాటు చేశారనీ.. బూత్ స్థాయిలో బీజేపీని బలోపేతం చేయటంలో ఆయన విజయం సాధించారనీ అమిత్ షా అన్నారు.

తెలంగాణ వంటి ప్రాంతాల్లో కూడా బీజేపీ పుంజుకున్నదనీ.. దక్షిణ భారత దేశంలో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. కరోనా సమయంలో కూడా బీజేపీ కార్యకర్తలకు కావాల్సిన సాయాన్ని నడ్డా పార్టీ ద్వారా అందజేశారనీ.. అందుకే ఆయన నేతృత్వంలోనే బీజేపీ మరోసారి ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నదని చెప్పారు. జేపీ నడ్డా వచ్చే సంవత్సరం జూన్ వరకు అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఈ విషయంలో పార్టీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here