Home TELANGANA బీబీసీ-ఐటీ దాడులపై కేటీఆర్ సెటైర్లు

బీబీసీ-ఐటీ దాడులపై కేటీఆర్ సెటైర్లు

0
బీబీసీ-ఐటీ దాడులపై కేటీఆర్ సెటైర్లు

ప్రముఖ ఇంటర్నేషనల్ మీడియా సంస్థ బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పోరేషన్-బీబీసీపై మంగళవారం ఉదయం నుంచి జరుగుతున్న ఐటీ సోదాలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఐటీ, ఈడీ, సీబీఐలను పూర్తిగా మోడీ ప్రభుత్వం తన కంట్రోల్ లో ఉంచుకున్నదని కేటీఆర్ విమర్శించారు. “నెక్స్ట్ ఈడీ దాడులు అదానీ కుంభకోణం గురించి చెప్పిన హిండెన్ బర్గ్ పైనేనా ?” అంటూ సెటైర్లు వేశారు కేటీఆర్. తమ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన వారిపై ఐటీ,ఈడీ, సీబీఐ దాడులు చేయించటం మోడీ ప్రభుత్వానికి అలవాటైందంటూ విమర్శించారు. ఈ మేరకు ట్విటర్ లో ట్వీట్ చేశారు.
కొద్ది రోజుల క్రితం బీబీసీ సంస్థ.. ప్రధాని మోడీ పై “ఇండియా – ది మోడీ క్వశ్చన్” పేరుతో ఓ డాక్యుమెంటరీని తెరకెక్కించింది. ఇందులో గుజరాత్ అల్లర్ల విషయంలో మోడీని దోషిగా చెప్పే ప్రయత్నం చేసింది బీబీసీ. దీంతో భారత ప్రభుత్వం దీన్ని నిషేధించింది. ఈ డాక్యుమెంటరీ చేసినందుకే ఇప్పుడు బీబీసీపై ఐటీ దాడులు చేస్తోందంటూ కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు మోడీ ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నాయి. అయితే.. ఎన్డీటీవీని అదానీ గ్రూప్ కొనుగోలు చేయటాన్ని సహించలేని ఓ వర్గం.. బీబీసీతో కావాలనే మోడీపై ఇలాంటి డాక్యుమెంటరీ చేయించింది అనేది కొంత మంది వాదన. అంతే కాదు.. అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ నివేదిక వెనుక కూడా ఎన్డీటీవీ, కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉంది అని కూడా ఓ వాదన ఉంది. ఎన్డీటీవీని అదానీ గ్రూప్ స్వాధీనం చేసుకున్న కొద్ది రోజులకే బీబీసీ మోడీ వివాదాస్ఫద డాక్యుమెంటరీ విడుదల చేయటం.. ఆ వెంటనే హిండెన్ బర్గ్ అదానీ గ్రూప్ పై నివేదిక విడుదల చేయటం జరగటం చూస్తుంటే ఇవి కావాలని చేసినవే అని స్పష్టంగా అర్థమవుతోందని బీజేపీ నేతలు చెప్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here