Home TELANGANA తెలంగాణ నాకు పునర్జన్మనిచ్చిన నేల-పవన్ కళ్యాణ్

తెలంగాణ నాకు పునర్జన్మనిచ్చిన నేల-పవన్ కళ్యాణ్

0
తెలంగాణ నాకు పునర్జన్మనిచ్చిన నేల-పవన్ కళ్యాణ్

తన కొత్త వాహనం వారాహికి పూజలు చేయించేందుకు గానూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించిన విషయం తెలిసిందే. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పవన్ మీడియా సమావేశంలో మాట్లాడాడు. ఈ సందర్భంగా పవన్ పలు కీలక అంశాలపై క్లారిటీ ఇచ్చాడు. తెలంగాణలో 7 నుంచి 14 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని చెప్పాడు. ఆయా స్థానాల్లో తాను ఖచ్చితంగా పర్యటిస్తానని చెప్పాడు. తెలంగాణలో పూర్తి స్థాయిలో జనసేన బరిలో నిలవదని స్పష్టం చేశాడు. బలం లేని చోట పోటీ చేయకూడదు అనేది తన ఉద్దేశమనీ.. అందుకే తెలంగాణలో తన పాత్ర పరిమితమేననీ పవన్ క్లారిటీ ఇచ్చాడు.
తెలంగాణ ఉద్యమనేల అనీ.. తెలంగాణ నేల తనకు పునర్జన్మనిచ్చిన నేలగా తాను భావిస్తాననీ చెప్పాడు పవన్ కళ్యాణ్. తెలంగాణ ప్రజల పోరాట పటిమ చాలా గొప్పదనీ.. ఈ నేలపై తిరిగితే.. ఈ గాలి పీల్చితే.. ఆవేశం వస్తుందనీ పవన్ ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన పోరాట స్ఫూర్తితోనే తాను ఏపీలో రాక్షసుల వంటి మనుషులతో పోరాటం చేస్తున్నాననీ చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం కనుక తెలంగాణలో ఉండి ఉంటే తెలంగాణ ప్రజలు ఎప్పుడో తిరగబడే వారనీ.. ఇక్కడి లెక్క వేరనీ పవన్ వ్యాఖ్యానించాడు. ఈ సారి తెలంగాణ అసెంబ్లీలో కనీసం 10 మంది జనసైనికులు మాట్లాడాలనేది తన ఆకాంక్ష అని పవన్ తన మనసులో మాట చెప్పాడు. ఓటుకు మాత్రమే రాజకీయ నాయకులు భయపడతారనీ.. అలాంటి ఓటు ద్వారానే ప్రజలు సమాధానం చెప్పాలనీ అన్నాడు. నోటాకు మాత్రం ఓటు వేయకండి అంటూ సూచన ఇచ్చాడు. తెలంగాణ గురించి.. ఉద్యమం.. పోరాటం.. ఇవన్నింటి గురించీ మాట్లాడిన పవన్ కేసీఆర్ బీఆర్ఎస్ ను తాను స్వాగతిస్తానన్నాడు. ఈ సందర్భంగా పవన్ ఎలాంటి పొలిటికల్ కాంట్రవర్శీ క్రియేట్ చేసే వ్యాఖ్యలు చేయకపోవటం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here