HomeNATIONAL NEWSగ్యాస్ కనెక్షన్లపై కేంద్రం కీలక నిర్ణయం

గ్యాస్ కనెక్షన్లపై కేంద్రం కీలక నిర్ణయం

Published on

Latest articles

గ్యాస్ కనెక్షన్లపై కేంద్రం కీలక నిర్ణయం

ప్రపంచవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ విషయంలో సంక్షోభం ఏర్పడిన తర్వాత.. ప్రపంచం మొత్తం ప్రత్యామ్నాయ మార్గాలను వెతకటం ప్రారంభించింది. లిక్విడ్...

ఆధార్ యాప్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై పాతది పనిచేయదు

ఆధార్ కార్డ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌పై యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకునే యాప్ విషయంలో...

మాటతప్పిన ట్రంప్.. ఇరాన్‌పై భారీ మెరుపు దాడి

అందరూ ఊహించినట్టే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రపంచానికి షాకిచ్చాడు. ఇరాన్ పై యుద్ధాన్ని ఆపేస్తున్నామనీ.. శాంతి ఒప్పందం...

ప్రపంచవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ విషయంలో సంక్షోభం ఏర్పడిన తర్వాత.. ప్రపంచం మొత్తం ప్రత్యామ్నాయ మార్గాలను వెతకటం ప్రారంభించింది. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్‌ను ఎంత వీలైతే అంత ఆదా చేయటంతో పాటు.. వీలైనంత తక్కువ వాడేందుకు కొత్త మార్గాలను అన్వేషించాల్సి వచ్చింది. భారతదేశం కూడా ఇదే మార్గంలో కొన్ని ప్రత్యామ్నాయాలను ఆలోచించింది. వాటిలోంచి పుట్టుకొచ్చిందే పైప్డ్ నేచురల్ గ్యాస్ ఆలోచన. పెట్రోలియం గ్యాస్ సరఫరా, పంపిణీ నియంత్రణ సవరణ ఉత్తర్వులు 2026 నోటిఫై చేస్తూ ప్రకటన జారీ చేసింది. పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్ పొందే డొమెస్టిక్ వినియోగదారులకు అదనపు ఉపశమనం, సౌకర్యం కల్పించేందుకు నిబంధనలను సవరించారు. పీఎన్‌జీ కనెక్షన్లు పొందే వినియోగదారులకు సౌకర్యం కల్పిస్తూ కొత్త రూల్స్‌ను తీసుకొచ్చారు. పీఎన్జీ కనెక్షన్లు ఉన్న ఎల్పీజీ వినియోగదారులకు పలు ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది. పైప్డ్ నేచురల్ గ్యా్స్ కనెక్షన్ పొందిన 30 రోజుల్లోపు ఎల్పీజీ కనెక్షన్ రద్దు చేయమని దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక భవిష్యత్తులో నాన్ పీఎన్‌జీ ప్రాంతంలోకి మారినప్పుడు ఎల్పీజీ కనెక్షన్ పునరుద్దరించుకునేందుకు ట్రాన్స్‌ఫర్ వోచర్ ఉపయోగించుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది.

పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్ అందుబాటులో లేని వారికి వెంటనే ఎల్పీజీ కనెక్షన్ ఇచ్చే విధంగా కొత్త వెసులుబాటు తీసుకొచ్చింది. అంటే.. పైప్డ్ నేచురల్ గ్యాస్ వాడుతున్న ఎవరైనా సరే.. ఉద్యోగరీత్యా లేదంటే మరే కారణం వల్లనైనా ఉన్న ప్రాంతం విడిచి వెళ్తే.. కొత్తగా నివాసం ఉండే చోట అడిగిన వెంటనే ఎల్పీజీ కనెక్షన్ ఇచ్చేలా కేంద్రం వెసులుబాటు తెచ్చింది. తరచుగా ట్రాన్స్‌ఫర్‌లు జరిగే ప్రభుత్వ ఉద్యోగులకు, అద్దె ఇళ్ళలో ఉండే వారికి, చదువు కోసం వలస వెళ్ళే విద్యార్థులకు సౌకర్యంగా ఉండేందుకు ఈ వెసులుబాటు తీసుకొచ్చింది. ఎల్పీజీ నుంచి పీఎన్జీకి.. పీఎన్జీ నుంచి ఎల్పీజీకి మారటంలో ఎలాంటి ఆలస్యం మరియు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. పీఎన్‌జీలోకి మారేవారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్రోత్సాహాకాలు కూడా ప్రకటిస్తున్నాయి. పీఎన్‌జీ కనెక్షన్లు తీసుకుంటే సబ్సిడీలు కూడా ప్రకటిస్తు్న్నాయి. ఇక చమురు కంపెనీలు కూడా పలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. పీఎన్‌జీ కనెక్షన్లు ఉన్నవారు ఎల్పీజీ కనెక్షన్లను సరెండర్ చేయాలని ఇటీవల కేంద్రం ఆదేశించింది. అయితే.. ఎల్పీజీ లేదా పీఎన్జీలలో ఏదో ఒక కనెక్షన్ మాత్రమే ఉండాలి.. రెండూ ఉంటే ఏదో ఒకటి రద్దు చేసుకోవాల్సిందే.

FOLLOW US

More like this

ఆధార్ యాప్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై పాతది పనిచేయదు

ఆధార్ కార్డ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌పై యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకునే యాప్ విషయంలో...

మాటతప్పిన ట్రంప్.. ఇరాన్‌పై భారీ మెరుపు దాడి

అందరూ ఊహించినట్టే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రపంచానికి షాకిచ్చాడు. ఇరాన్ పై యుద్ధాన్ని ఆపేస్తున్నామనీ.. శాంతి ఒప్పందం...

చైనాకు గట్టి షాక్.. అమెరికా భారత్‌ మధ్య మరో భారీ డీల్

రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో ప్రపంచంపై ఆధిపత్యం సాగిస్తున్న చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా భారత్ మరో కీలక...