ఏపీ నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయటంతో పాటు ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేసి కొత్త పోస్టులను క్రియేట్ చేయాలని కూడా ఆదేశించారు. అలాగే 63 సీడీపీఓ పోస్టులను భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అప్పుడే పుట్టిన పసిపాప మరియు బాలింతల ఆరోగ్యం విషయంలో అత్యంత ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని స్త్రీ శిసు సంక్షేమ శాఖ అధికారులకు చెప్పారు. వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు వారికి ఎదురు కాకూడదని, ఆరోగ్యశ్రీ ద్వారా అందాల్సిన సేవల్లో కూడా ఎలాంటి లోపం ఉండరాదనీ చెప్పారు.
అంగన్ వాడీల ద్వారా ప్రతి వార్డులోని తల్లి పిల్లలకు అవసరమైన సేవలు అందించటంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని.. అధికారులు నిరంతరం సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. తల్లులకు టేక్ హోమ్ విధానంలో రేషన్ విధానంపై కసరత్తు పూర్తి చేసి.. వీలైనంత త్వరలో ఇంటికే సేవలను అందించే కార్యక్రమం ప్రారంభించాలని చెప్పారు. గతంలో ఈ సేవల విషయంలో సిబ్బంది కొరత ఉన్న విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావటంతో.. వెంటనే ఆయా ఖాళీలను భర్తీ చేసి పూర్తి స్థాయి సిబ్బంది నియామకాన్ని చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు.