Home INTERNATIONAL NEWS మరో పనికిమాలిన నిర్ణయం తీసుకున్న పాకిస్తాన్

మరో పనికిమాలిన నిర్ణయం తీసుకున్న పాకిస్తాన్

0
మరో పనికిమాలిన నిర్ణయం తీసుకున్న పాకిస్తాన్

ఒక్క గోధుమ రొట్టె కోసం వీధుల్లో తుపాకులతో యుద్ధాలు చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు ప్రస్తుతం పాకిస్తాన్ ప్రజలు. అన్నం లేక ఏడుస్తున్న ప్రజా సంక్షేమాన్ని.. తుఫానులా కమ్మేస్తున్న ఆర్థిక సంక్షోభాన్ని పక్కనపెట్టి.. పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న ఓ పనికిమాలిన నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారటంతో పాటు పాక్ ప్రభుత్వాన్ని తిట్టిపోసేలా చేసింది. చేతిలో చిల్లిగవ్వ లేని పాకిస్తాన్ ప్రభుత్వం అన్ని శాఖలను పక్కన పెట్టి ప్రస్తుతం క్రీడాశాఖ మీద దృష్టి పెట్టింది. పాకిస్తాన్ బౌలర్ వహాబ్ రియాజ్ కు పిలిచి మరీ క్రీడాశాఖ మంత్రి పదవిని చేతిలో పెట్టింది పాకిస్తాన్ ప్రభుత్వం. ఎక్కడో బంగ్లాదేశ్ లో క్రికెట్ టోర్నీతో బిజీగా ఉన్న రియాజ్ ను అర్జెంటుగా పాకిస్తాన్ వచ్చి మంత్రి పదవి చేపట్టాలని పాకిస్తాన్ ప్రభుత్వం హుకుం జారీ చేసింది.
ఆర్థిక మంత్రులుగా ఒకరి తర్వాత ఒకరిని నియమించటం.. పీకేయటం గత కొద్ది రోజులుగా జరుగుతోంది పాకిస్తాన్లో. ఆ దేశ మంత్రులు చిప్పలు చేతపట్టుకొని ఇస్లామిక్ దేశాలతో పాటు అది ఇదీ తేడా లేకుండా అన్ని దేశాల చుట్టూ తిరుగుతున్నారు అప్పు కోసం. పోయిన ప్రతి చోటా లేదు అనే మాట తప్ప మరో మాట వినిపించటం లేదు పాపం పాక్ మంత్రులకు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కాలో ఆలోచించాలే తప్ప.. ఇంత హడావుడిగా రియాజ్ వచ్చి క్రీడా శాఖ మంత్రి అయిపోయి దేశాన్ని ఏం ఉద్ధరిస్తాడో పాక్ ప్రధాని షరీఫ్ కే తెలియాలి అనేది జనం మాట. నిజంగా పాకిస్తాన్ పాలకుల మెదళ్ళు పనిచేయటం మానేసి ఉంటుంది. లేకపోతే ఈ పరిస్థితుల్లో ఇలాంటి పని అవసరమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here