Home INTERNATIONAL NEWS 15 యేళ్ళ పాత వాహనాలపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

15 యేళ్ళ పాత వాహనాలపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

0
15 యేళ్ళ పాత వాహనాలపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

15 సంవత్సరాలు పైబడిన వాహనాలన విషయంలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. 15 సంవత్సరాలు పైబడిన వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దు చేసి వెంటనే వాటిని తుక్కు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. బైక్, కారు, బస్సు, లారీ.. ఇలా ఏ వాహనమైనా సరే మానుఫాక్చర్ అయ్యి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే ఇక ఆ వాహనం రోడ్డుపై కనిపించకూడదు. అధికారులు ఇలాంటి వాహనాలు ఎక్కడ కనిపించినా వాటిని స్వాధీనం చేసుకొని వాటిని తుక్కు చేసేయనున్నారు. రోడ్డు ప్రమాదాలను, కాలుష్యాన్ని నియంత్రించటంతో పాటు మరి కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా శాఖ స్పష్టం చేసింది.
గవర్నమెంట్ బస్సులు, ప్రైవేటు వాహనాలు, ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారుల వాహనాలు.. ఇలా ఏ వాహనమైనా సరే ఈ కొత్త రూల్ వర్తిస్తుందని అధికారులు చెప్తున్నారు. కేవలం రక్షణ శాఖకు మరియు దేశ, రాష్ట్ర అంతర్గత భద్రత శాఖలకు సంబంధించిన వాహనాలకు మాత్రమే మినహాయింపు ఇస్తున్నట్టు అధికారులు తెలిపారు. తక్షణమే ఈ నిబంధన అమల్లోకి తెస్తున్నామనీ.. 15 సంవత్సరాల పైబడిన వాహనాల జాబితా తీసి వాటి రిజిస్టేషన్ నెంబర్లు క్యాన్సిల్ చేసేస్తామనీ చెప్పారు. అధికారుల చేతికి చిక్కిన వాహనాలు స్క్రాప్ కింద మార్చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here