Home TELANGANA తెలంగాణ కొత్త సీఎస్ గా ఐఏఎస్ శాంతి కుమారి

తెలంగాణ కొత్త సీఎస్ గా ఐఏఎస్ శాంతి కుమారి

0
తెలంగాణ కొత్త సీఎస్ గా ఐఏఎస్ శాంతి కుమారి

తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ గా ఐఏఎస్ అధికారి శాంతి కుమారి నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేయనుంది. 2025 వరకు తెలంగాణ సీఎస్ గా శాంతి కుమారి కొనసాగనున్నారు. తెలంగాణ సీఎస్ గా పనిచేస్తున్న సోమేష్ కుమార్ తిరిగి ఏపీకి వెళ్ళిపోవాలంటూ హైకోర్టు తీర్పునివ్వటం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ కు కొత్త చీఫ్ సెక్రటరీని నియమించాల్సి వచ్చింది. సోమేష్ కుమార్ రేపు ఏపీ ప్రభుత్వారనికి రిపోర్టు చేయనున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ చీఫ్ సెక్రెటరీగా తప్పుకున్న తర్వాత ఆయన ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయకుండా ఏకంగా రిటైర్మెంట్ తీసుకుందమని నిర్ణయించుకున్నట్టు తొలుత వార్తలు వినిపించాయి. రిటైర్మెంట్ తర్వాత ఆయన తెలంగాణ ముఖ్య సలహాదారుడిగా పదవి చేపట్టవచ్చని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన ఏపీకి వెళ్ళిపోయి సర్వీస్ కాలం పూర్తి చేయాలని భావిస్తున్నారని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here