Home TELANGANA ఎయిర్ టెల్ యూజర్లకు గుడ్ న్యూస్ : అన్ లిమిటెడ్ డేటా ఫ్రీ

ఎయిర్ టెల్ యూజర్లకు గుడ్ న్యూస్ : అన్ లిమిటెడ్ డేటా ఫ్రీ

0
ఎయిర్ టెల్ యూజర్లకు గుడ్ న్యూస్ : అన్ లిమిటెడ్ డేటా ఫ్రీ

5జీ రాకతో మరోసారి టెలీకామ్ ఆపరేటర్ల మధ్య పోటీ పెరిగింది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు.. యూజర్లను పెంచుకునేందుకు.. లీడింగ్ ఆపరేటర్లు అయిన రిలయన్స్ జియో మరియు ఎయిర్ టెల్ రేసు మొదలుపెట్టాయి. ఇటీవలే భారతదేశంలోని సెలెక్టెడ్ నగరాలలో 5జీ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. 5జీ ముబైల్ హ్యాండ్ సెట్ కలిగి ఉండి 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉన్న నగరాల్లో ఉండే వారికి డేటా విషయంలో లిమిట్ తీసేసింది రిలయన్స్ జియో. రోజుకు ఇంతే డాటా వాడుకోవాలనే రూల్ ను ఎత్తేసి వెల్కమ్ ఆఫర్ కింద 5జీ వినియోగదారులకు అన్ లిమిటెడ్ డాటాను అందుబాటులోకి తెచ్చింది. దీంతో మరో లీడింగ్ ఆపరేటర్ ఎయిర్ టెల్ కూడా ఇదే ఆఫర్ రిలీజ్ చేసింది. కనీసం 239 రీచార్జ్ చేసుకున్న వారికి అన్ లిమిటెడ్ డేటా ఆఫర్ ను ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ 4జీ యూజర్లకు వర్తించదు.
దేశవ్యాప్తంగా 270 నగరాలు, పట్టణాల్లో 5జీ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు 5జీ ఫోన్లు కలిగి ఉంటే కనుక.. ఇక వారికి డేటా విషయంలో హద్దులు లేవన్నమాట. వినియోగదారులు నిరంతరం ఆన్ లైన్ లో ఉండి సేవలను పొందటానికే ఈ ఆఫర్లను ప్రకటించామంటూ ఆపరేటర్లు చెప్తున్నాయి. జియో, ఎయిర్ టెల్ ఆఫర్లతో రానున్న రోజుల్లో 5జీ ముబైల్స్ అమ్మకాలు పెరగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 5జీ యూజర్లు పెరిగితే కనుక 4జీ డేటా ధరలు కాస్త తగ్గే అవకాశం ఉంది. మరో సంవత్సరం కల్లా ప్రస్తుతం 4జీ వినియోగిస్తున్న యూజర్లలో కనీసం 30 శాతం మంది 5జీకి అప్ గ్రేడ్ అవుతారని అంచనా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here