Home TELANGANA TSPSC సంచలన నిర్ణయం : ఆ 20 పరీక్షలు రద్దు

TSPSC సంచలన నిర్ణయం : ఆ 20 పరీక్షలు రద్దు

0
TSPSC సంచలన నిర్ణయం : ఆ 20 పరీక్షలు రద్దు

పేపర్ లీకేజి వివాదంలో తెలంగాణ పబ్లిక్ సర్వీర్ కమిషన్ పై తీవ్ర ఒత్తిడి నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే గ్రూప్ 1, ఏఈ పరీక్ష రద్దు చేసినట్టు ప్రకటించిన కమిషన్.. ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం 20కి పైగా పరీక్షలను పూర్తిగా రద్దు చేసి మరోసారి నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు జరిగిన పరీక్షలతో పాటు జరగాల్సిన పరీక్షలను కూడా రద్దు చేసి.. మరో కొత్త ప్రశ్న పత్రాలు తయారు చేసిన తర్వాత మళ్ళీ పరీక్షలు నిర్వహించేందుకు కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు గ్రూప్-1 ప్రిలిమ్స్, ఏఈ, డీఏఓ, టౌన్ ప్లానింగ్ పరీక్షలు రద్దు చేశారు. ఇవి ఇప్పటికే పూర్తైన పరీక్షలు కాగా.. షెడ్యూల్ చేసిన పరీక్షలను కూడా రద్దు చేసింది. మరికొద్ది సేపట్లో ఇందుకు సంబంధించిన వివరాలను కమిషన్ సభ్యులు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న ప్రవీణ్ ఇంట్లో సోదాలు చేపట్టిన పోలీసులు.. ప్రవీణ్ లాప్ టాప్, పెన్ డ్రైవ్ వంటివి తనిఖీ చేయగా.. కమిషన్ రూపొందించిన అన్ని రకాల ప్రశ్నపత్రాలు తన పెన్ డ్రైవ్ లో కాపీ చేసి పెట్టుకున్నట్టు పోలీసులు గుర్తించారు. భవిష్యత్తులో జరగాల్సిన పరీక్షల కోసం రూపొందించిన క్వశ్చన్ పేపర్లను కూడా ప్రవీణ్ వద్ద ఉండటం చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఈ పేపర్లను ఎవరెవరికి ఇచ్చాడో ఎంత మంది కొన్నారో సమాచారం లేదు కాబట్టి.. అన్ని పరీక్షలను రద్దు చేయటం తప్ప కమిషన్ కు మరో అవకాశం లేకుండా పోయింది. గ్రూప్ -1 ప్రిలిమ్స్ ను జూన్ 11న నిర్వహిస్తామని ప్రకటించిన కమిషన్.. మిగతా పరీక్షల తేదీలను త్వరలో వెల్లడిస్తామని ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here