HomeNATIONAL NEWSఢిల్లీ లిక్కర్ కేసు : సిసోదియాకు మరోసారి షాక్

ఢిల్లీ లిక్కర్ కేసు : సిసోదియాకు మరోసారి షాక్

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

దేశవ్యాప్తంగా కలకలం సృష్టించి చర్చనీయాంశంగా మారిన ఢిల్లీ లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడు, ఢిల్లీ మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాకు ఢిల్లీ హైకోర్టు మరోసారి షాకిచ్చింది. సిసోదియా బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. ఈసారైనా బెయిల్ దొరుకుతుందేమని ఆశగా కోర్టుకు వచ్చిన సిసోదియాకు మళ్ళీ నిరాశే ఎదురైంది.

సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ సిసోదియా అపోజిషన్ నుంచి వచ్చిన వాదనతో ఢిల్లీ హైకోర్టు ఏకీభవిస్తూ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. ఢిల్లీలో అమలులో ఉన్న లిక్కర్ పాలసీని రద్దు చేసి సరికొత్త మద్యం విధానాన్ని రూపొందించి.. ప్రైవేటు వ్యక్తులకు లాభాలు వచ్చే విధంగా మరియు ప్రభుత్వ సొమ్మును దోచుకునే విధంగా కుంభకోణానికి పాల్పడ్డాడు అనేది మనీష్ సిసోదియా పై ఉన్న సీబీఐ నేరారోపణ. అలాగే అక్రమ లావాదేవీలు చేశాడంటూ మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు పెట్టింది. సిసోదియాను ఈ కేసుల్లో పలు సార్లు సీబీఐ, ఈడీ అధికారులు విచారించారు.. అనంతరం అరెస్టు చేసి జైళ్ళో పెట్టారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కూడా ఇందులో ప్రమేయం ఉన్నదని ఈడీ, సీబీఐ చెప్తున్నాయి. ఇదివరకే కేజ్రీవాల్ ను సీబీఐ అధికారులు విచారించారు కూడా. మద్యం కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఢిల్లీ పాత మద్యం విధానమే కొనసాగుతుందంటూ ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే.. అసలు లిక్కర్ పాలసీలో కుంభకోణమే జరగలేదనీ.. కేవలం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కావాలని తమను ఇరికించిందంటూ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నాడు. గత కొద్ది రోజులుగా ఈ కేసు విచారణ గురించి ఎలాంటి వార్తలూ రాలేదు

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...